News November 9, 2024
సంచలనం.. 400 పరుగులు చేశాడు

దేశవాళీ టోర్నీలో హరియాణా ప్లేయర్ యశ్వర్ధన్ దలాల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సీకే నాయుడు ట్రోఫీలో ముంబైతో జరుగుతున్న మ్యాచులో 463 బంతుల్లో 46 ఫోర్లు, 12 సిక్సర్లతో 426* పరుగులు చేశారు. దీంతో హరియాణా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 732 పరుగులు చేసింది.
Similar News
News November 14, 2025
భారత విద్యార్థులకు రష్యా స్కాలర్షిప్స్

తమ దేశంలో చదువుకునే భారత విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని రష్యా ప్రకటించింది. 2026-27లో 300 మందికి అందజేస్తామని తెలిపింది. రష్యాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఏవియేషన్, మేనేజ్మెంట్ తదితర డిగ్రీ, PG కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ స్కాలర్షిప్స్లో ట్యూషన్ ఫీజు కవర్ అవుతుందని, విద్యార్థులు ఎలాంటి ఖర్చు లేకుండా చదువుకోవచ్చని చెప్పింది.
News November 14, 2025
‘రహేజా’కు భూ కేటాయింపుతో APకి ఏం లాభం? SMలో ప్రశ్నలు

AP: విశాఖలో రహేజా సంస్థకు 99 పైసలకే 27 ఎకరాల భూ కేటాయింపును నెటిజన్లు తప్పుబడుతున్నారు. భారీగా ఉద్యోగాలు కల్పించే TCS లాంటి కంపెనీలకు ఇవ్వడంలో తప్పు లేదు కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ సంస్థకు కారుచౌకగా కట్టబెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆస్తిని కొద్దిమంది బలవంతులకు భోజనంగా వడ్డించినట్లు ప్రభుత్వ నిర్ణయం ఉంది తప్ప, APకి ఏ లాభం కన్పించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
News November 14, 2025
టాస్ ప్రాక్టీస్ చేస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్.. కారణమిదే!

కోల్కతాలో రేపు సౌతాఫ్రికా-ఇండియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ కెప్టెన్ బవుమా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల కేన్ విలియమ్సన్ను కలిశా. భారత్ను ఓడించేందుకు కొన్ని పాయింట్స్ అడిగా. కేన్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ టాస్ గెలవాలని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కాయిన్ టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని చెప్పారు. తాము సిరీస్ కోసం బాగానే సిద్ధమయ్యామని అనుకుంటున్నానని తెలిపారు.


