News August 22, 2025
సంచలనం.. చరిత్ర సృష్టించిన క్రికెటర్

వన్డేల్లో ఆడిన తొలి 4 మ్యాచ్ల్లో 50+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్గా సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే నిలిచారు. AUSతో జరుగుతున్న 2వ వన్డేలో 78 బంతుల్లో 88 రన్స్ చేసి ఈ ఘనత అందుకున్నారు. గతంలో భారత మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ 5 వన్డేల్లో(3వ ODIలో బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు) ఈ ఘనత సాధించారు. మాథ్యూ 4 వన్డేల్లో NZపై 150, PAKపై 83, AUSపై తొలి వన్డేలో 57, 2వ వన్డేలో 88 రన్స్తో రికార్డులకెక్కారు.
Similar News
News August 22, 2025
ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఇది చట్టం కానుండగా, ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.కోటి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. రూల్స్ ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చే వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.50లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ఆన్లైన్ గేమింగ్ మోసాలు నివారించేలా కేంద్రం దీనిని తీసుకొచ్చింది.
News August 22, 2025
కొత్త సినిమాలో చిరంజీవి మరో లుక్ చూశారా?

చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి మరో లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇవాళ ఉదయం విడుదల చేసిన గ్లింప్స్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇదే ఉత్సాహంలో సెకండ్ లుక్ను రిలీజ్ చేసింది. ఇందులో కుర్చీలో స్టైల్గా కూర్చున్న చిరు సిగరెట్ తాగుతూ కనిపించారు. ఈ కొత్త పోస్టర్ సైతం అభిమానులను ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
News August 22, 2025
సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

TG: కూకట్పల్లిలో సహస్ర మర్డర్ <<17484838>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అది సహస్ర చూడగా వెంట తెచ్చుకున్న కత్తితో 21 సార్లు పొడిచి చంపాడు. చోరీ ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి అని పేపర్లో ముందే రాసుకున్నాడు. స్థానికుడైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సమాచారంతో పోలీసులు బాలుడిని ప్రశ్నించగా విషయం బయటపడింది. లెటర్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.