News October 24, 2024

సంచలనం.. 256 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే చేధించారు

image

మహారాష్ట్ర ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. పీబీజీతో జరిగిన మ్యాచులో జెట్ జట్టు భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన PBG 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది. ఛేదనలో జెట్ 18.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. జెట్ బ్యాటర్లలో దివ్యాంగ్(49 బంతుల్లో 93*), రోహిత్ పాటిల్(30 బంతుల్లో 80) పరుగులు చేశారు.

Similar News

News January 27, 2026

కృష్ణా: అరుణాచలం వెళ్లేవారికి ఊరట కలిగించే వార్త

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS)- అరుణాచలం(తిరువణ్ణామలై- TNM) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07219 NS- TNM రైలును FEB 25 వరకు ప్రతి బుధవారం, నం.07220 TNM- NS మధ్య నడిచే రైలును FEB 26 వరకు ప్రతి గురువారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.

News January 27, 2026

జనవరి 27: చరిత్రలో ఈరోజు

image

1922: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ జననం
1927: తెలుగు కవి, రచయిత పోతుకూచి సాంబశివరావు జననం
1936: కథా, నవలా రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి జననం
2009: భారత మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ మరణం
2023: సినీ నటి జమున మరణం (ఫొటోలో)
* కుటుంబ అక్షరాస్యత దినోత్సవం

News January 27, 2026

పొలిటికల్ వెపన్‌లా సిట్ నోటీసులు: హరీశ్ రావు

image

TG: రేవంత్ ప్రభుత్వం సిట్ నోటీసుల్ని పొలిటికల్ వెపన్‌లా వాడుతోందని హరీశ్ రావు అన్నారు. కోల్ స్కామ్‌పై ప్రశ్నించడంతో పబ్లిక్ అటెన్షన్‌ను డైవర్ట్ చేసేందుకు తనకు, KTRకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని BRS నిర్ణయించిన కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు వచ్చాయన్నారు. కాగా మంగళవారం గవర్నర్‌ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు ఇవ్వనున్నట్లు BRS తెలిపింది.