News June 23, 2024

సంచలన కేసు.. 48 గంటల్లో నిందితులు అరెస్ట్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాపట్ల(D) ఈపురుపాలెం హత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై CM సీరియస్ కావడం, <<13485589>>హోం మంత్రి<<>> ప్రత్యేక దృష్టి సారించడంతో కేసును సవాలుగా స్వీకరించి 48 గంటల్లోనే ఛేదించినట్లు SP వకుల్ తెలిపారు. నిందితులు దేవరకొండ విజయ్, మహేశ్‌తో పాటు శ్రీకాంత్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారన్నారు.

Similar News

News December 6, 2025

నేడు అమెరికాకు మంత్రి లోకేశ్

image

AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్‌లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. ఈ 18 నెలల్లో లోకేశ్ అమెరికా వెళ్లడం రెండోసారి కావడం విశేషం. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.

News December 6, 2025

శ్రీశైలం: పాతాళగంగ నీరు పచ్చగా ఎందుకు?

image

చంద్రగుప్త మహారాజు ఓ రాజ్యాన్ని ఓడించి, అంతఃపురంలో ఉన్న రాణిని తన కూతురని తెలియక ఆశించాడు. ఆ విషయం తెలిసినా వెనక్కి తగ్గలేదు. దీంతో చంద్రవతి శ్రీశైలం వచ్చి శివుడిని ప్రార్థించింది. అక్కడకు వచ్చిన చంద్రగుప్తుడు చంద్రవతిని చెడగొట్టబోతుండగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. కామంతో కనులు మూసుకుపోయిన చంద్రగుప్తుడిని పచ్చలబండపై పాతాళగంగలో పడి ఉండమని శాపమిచ్చాడు. అందుకే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందని కథనం.

News December 6, 2025

టాస్ గెలిస్తే.. సిరీస్ గెలిచినట్లే!

image

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌ 1-1తో సమమైన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా ఇవాళ టాస్ గెలవాలి. మొదట బ్యాటింగ్ చేసి ఎంత భారీ స్కోర్ చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు దెబ్బకు బౌలింగ్ తేలిపోతోంది. ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్‌లో విశాఖలో జరిగిన 5 ODIల్లో ఛేజింగ్ టీమే గెలిచింది. ఏ విధంగా చూసినా ఇవాళ్టి మ్యాచ్‌లో టాసే కీలకంగా కనిపిస్తోంది.