News December 27, 2024
మన్మోహన్ సింగ్పై సంచలన కామెంట్స్

నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై శివసేన(షిండే) నేత, మాజీ MP సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన్మోహన్ గొప్ప నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన పాలనపై ఎన్నో మచ్చలున్నాయి. అవి ఇప్పటివరకు చెరిగిపోలేదు’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘అప్పుడు మీరూ ఆ ప్రభుత్వంలోనే ఉన్నారుగా’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల MH అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరారు.
Similar News
News December 12, 2025
మహిళలకు త్వరలో ఆర్టీసీ స్మార్ట్ కార్డులు!

TG: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో మహిళలకు అందించిన ‘సహేలీ’ తరహా కార్డులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ కార్డులపై లబ్ధిదారుల ఫొటో, వివరాలు ఉంటాయి. ఈ కార్డులు వస్తే ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం తప్పనుంది.
News December 12, 2025
‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్

‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మ.1.15 గంటలకు దీనిపై విచారణ జరగనుంది. నిన్న సినిమా టికెట్ల పెంపుపై పిటిషన్ను విచారించిన కోర్టు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను రద్దు చేసింది.
News December 12, 2025
రెండో విడతలోనూ పై‘చేయి’కి కసరత్తు

TG: నిన్న ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. 2,200+ స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ 1,100+, బీజేపీ 180+ స్థానాల్లో విజయం సాధించారు. తొలి విడతలో చూపిన జోరునే ఈ నెల 14న జరిగే రెండో విడత పోలింగ్లోనూ కొనసాగించాలని హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. 4,332 పంచాయతీలు, 38,322 వార్డులకు ఆ రోజు ఎన్నికలు జరగనున్నాయి.


