News December 27, 2024
మన్మోహన్ సింగ్పై సంచలన కామెంట్స్

నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై శివసేన(షిండే) నేత, మాజీ MP సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన్మోహన్ గొప్ప నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన పాలనపై ఎన్నో మచ్చలున్నాయి. అవి ఇప్పటివరకు చెరిగిపోలేదు’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘అప్పుడు మీరూ ఆ ప్రభుత్వంలోనే ఉన్నారుగా’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల MH అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరారు.
Similar News
News December 23, 2025
విద్యుత్ ఛార్జీలు తగ్గించండి… ఇరిగేషన్ శాఖ లేఖ

TG: ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరఫరా అయ్యే విద్యుత్పై అదనపు ఛార్జీలను తగ్గించాలని ఇరిగేషన్ శాఖ విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాసింది. నెలకు KVAకు ₹300 చొప్పున వసూలు చేయడాన్ని ఆపాలంది. యూనిట్ విద్యుత్కు వసూలు చేస్తున్న ₹6.30 సుంకాన్నీ తగ్గించాలని పేర్కొంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్లకు సరఫరా అవుతున్న విద్యుత్ లోడ్ 2819.80 MWగా ఉంది. 2026లో ఇది 7348 MWకు చేరుతుందని అంచనా.
News December 23, 2025
ఇదే లాస్ట్ ఛాన్స్: అక్రమ వలసదారులకు US వార్నింగ్

అక్రమ వలసదారులు ఏడాది చివరికి స్వచ్ఛందంగా దేశాన్ని వీడేందుకు రిజిస్టర్ చేసుకుంటే 3వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ సర్కారు ప్రకటించింది. స్వదేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. సెల్ఫ్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్లో భాగంగా ఇప్పటివరకు చెల్లించే వెయ్యి డాలర్లను $3వేలకు పెంచింది. దేశాన్ని వీడేందుకు వారికి ఇదే చివరి అవకాశమని, తర్వాత అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News December 23, 2025
TDP-JSP అబద్ధాలు బయట పడ్డాయి: జగన్

AP: వైసీపీ హయాంలో AP బ్రాండ్ దెబ్బతిందంటూ TDP, JSP చెప్పింది అబద్ధమని తేలినట్లు Ex.CM జగన్ పేర్కొన్నారు. ‘AP బ్రాండ్, పెట్టుబడులు దెబ్బతిన్నాయని వారు ఆరోపించారు. కానీ RBI డేటా ప్రకారం 2019-24 మధ్య మాన్యుఫాక్చరింగ్లో సౌత్లో AP ఫస్ట్, దేశవ్యాప్తంగా ఐదోస్థానంలో ఉంది. ఇండస్ట్రీ సెక్టార్లో సౌత్లో ఫస్ట్, దేశంలో 8వ స్థానంలో నిలిచింది. దీనిని బ్రాండ్ దెబ్బతినడం అంటారా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.


