News March 28, 2025
ప్రభుత్వం సంచలన నిర్ణయం

TG: పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్పై పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మెట్రోరైలు MD ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండటం గమనార్హం. ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తగా 6వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది.
Similar News
News November 18, 2025
MBNR: నవోదయ పరీక్ష హాల్టికెట్లు విడుదల

బండమీదిపల్లి, వట్టెం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్టికెట్లను https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జానకిరాములు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలను 29 కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 18, 2025
MBNR: నవోదయ పరీక్ష హాల్టికెట్లు విడుదల

బండమీదిపల్లి, వట్టెం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్టికెట్లను https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జానకిరాములు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలను 29 కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 18, 2025
జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగుకు అవసరమయ్యే ఎరువులు

జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో మంచి దిగుబడి రావాలంటే పంటకు అవసరమైన ఎరువులను వివిధ దశల్లో అందించాలి.
☛ పంట విత్తేటప్పుడు 50kg DAP+20kg MOP వేయాలి.
☛ పంట 20 రోజుల వయసులో 50kg యూరియా
☛ పంట 40 రోజుల వయసులో 50kg యూరియా
☛ పంట 60 రోజుల వయసులో 25kg యూరియా+15kg MOP ☛ ప్రతి మూడు సీజన్లకు ఒకసారి జింక్ సల్ఫేట్ 20kgలను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.


