News August 22, 2025

సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

image

TG: కూకట్‌పల్లిలో సహస్ర మర్డర్ <<17484838>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అది సహస్ర చూడగా వెంట తెచ్చుకున్న కత్తితో 21 సార్లు పొడిచి చంపాడు. చోరీ ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి అని పేపర్‌లో ముందే రాసుకున్నాడు. స్థానికుడైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సమాచారంతో పోలీసులు బాలుడిని ప్రశ్నించగా విషయం బయటపడింది. లెటర్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News August 22, 2025

భారత్‌కు మద్దతు.. అమెరికా మాజీ NSA ఇంట్లో తనిఖీలు

image

INDపై ట్రంప్ టారిఫ్‌లను తప్పుబట్టిన US మాజీ జాతీయ భద్రతా సలహాదారు(NSA) జాన్ బోల్టన్ ‌ఇంట్లో FBI తనిఖీలు చేపట్టింది. INDకు మద్దతు తెలిపిన మరునాడే ఇలా జరగడం గమనార్హం. తమ అధికారులు విధులు నిర్వర్తించారని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. తనిఖీలు జరుగుతున్నా జాన్ వెనక్కి తగ్గలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఉక్రెయిన్-రష్యాతో భేటీలు అవుతూనే ఉంటారని విమర్శించారు.

News August 22, 2025

త్వరలో అసెంబ్లీ సమావేశాలు!

image

TG: త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జరిగే క్యాబినెట్ భేటీలో తేదీలు ఖరారు చేస్తారని విశ్వసనీయ సమాచారం. సమావేశాల సందర్భంగా కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక గురించి ముఖ్యంగా చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

News August 22, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు, ఆగస్టు 25 నాటికి ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.