News April 12, 2025
సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించింది. ఒకవేళ గడువు దాటితే అందుకు గల కారణాలను గవర్నర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులో 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తన వద్ద పెండింగ్లో ఉంచడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు బిల్లుల పరిశీలనకు రాష్ట్రపతికి గడువు అనేది లేదు.
Similar News
News February 17, 2026
రికార్డు సృష్టించిన శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్

T20 WCలో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ రికార్డు సృష్టించింది. హాట్స్టార్లో 10 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో ఈ టోర్నీలో 100 మిలియన్ల వ్యూయర్షిప్ సాధించిన తొలి నాన్ ఇండియా మ్యాచ్గా నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 181 పరుగుల <<19162360>>లక్ష్యాన్ని<<>> 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే శ్రీలంక ఛేదించింది. T20 WCలో ఆ జట్టుకు ఇదే హయ్యెస్ట్ ఛేజింగ్.
News February 17, 2026
ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్!

TG: పంచాయతీ, మున్సిపల్ పోరు ముగియడంతో ఇక MPTC, ZPTC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇవాళ అధికారులతో CM రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని, 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, <<19148172>>ఇంటర్<<>>, టెన్త్ పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.
News February 17, 2026
హార్దిక్ పాండ్య ‘రుద్ర’ వాచ్ గురించి తెలుసా?

శివరాత్రి రోజున <<19153355>>పాక్తో జరిగిన<<>> మ్యాచ్లో భారత ప్లేయర్ హార్దిక్ పాండ్య ధరించిన వాచ్పై నెట్టింట చర్చ జరుగుతోంది. జాకబ్ అండ్ కో సంస్థ ‘రుద్ర’ పేరుతో వీటిని తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.25 లక్షల వరకు ఉంటుందని, ప్రపంచంలో 25 పీసులే ఉన్నాయని తెలుస్తోంది. వాచ్ డిస్ప్లేపై ధ్యానంలో ఉన్న శివుడు, ఓం, గుడి చిత్రాలున్నాయి. 41 MM గ్రేడ్ 5 టైటానియం కేస్తో ఇది తయారైంది. 70 గంటలపాటు పవర్ రిజర్వ్ ఉంటుంది.


