News April 12, 2025
సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించింది. ఒకవేళ గడువు దాటితే అందుకు గల కారణాలను గవర్నర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులో 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తన వద్ద పెండింగ్లో ఉంచడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు బిల్లుల పరిశీలనకు రాష్ట్రపతికి గడువు అనేది లేదు.
Similar News
News February 15, 2026
వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే?

కొలంబోలో నేడు జరగాల్సిన భారత్-పాక్ హై-వోల్టేజ్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ టైమ్(7pm)కు వర్షం కురిసే ఛాన్స్ 65% వరకు ఉందని వాతావరణ శాఖ అంచనా. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే లేదు. వర్షం వల్ల కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దవుతుంది. అప్పుడు ఇరుజట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ఇప్పటికే తలో రెండు విజయాలతో ఉన్న భారత్, పాక్.. 5 పాయింట్లతో నేరుగా సూపర్-8కు చేరుకుంటాయి.
News February 15, 2026
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ముప్పు ఎవరికి ఎక్కువంటే?

* గతంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లలో మరోసారి కూడా వచ్చే అవకాశముంది. * భాగస్వామి నుంచి గనేరియా, క్లమీడియా వంటి లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ముప్పు కనిపించవచ్చు. * సంతాన సాఫల్యత కోసం చికిత్సలు తీసుకుంటున్నవారు. * ఫెలోపియన్ ట్యూబుల్లో లోపాలుండి, వాటిని సరిదిద్దేందుకు శస్త్రచికిత్స తీసుకున్నవారు. * పొగతాగే అలవాటు ఉన్న మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఎక్కువ.
News February 15, 2026
పుల్వామా అమరుల పిల్లలకు అండగా ఉండటం మన బాధ్యత: సెహ్వాగ్

పుల్వామా <<19137017>>అమరవీరుల<<>> పిల్లలకు ఏడేళ్లుగా అండగా ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. తమ స్కూల్లో చదువుతున్న కొందరు పిల్లలు రాణించడం చూసి సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ‘మన కలల్ని కాపాడేందుకు సైనికులు ప్రాణాలు అర్పించారు. వారి కలలను మనం కాపాడుకోవాలి. ఇది మన కృతజ్ఞత, బాధ్యత. ఈ పిల్లల పట్ల గర్వంగా ఉంది. వారి తండ్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. జై హింద్’ అని పేర్కొన్నారు.


