News September 6, 2024
సెన్సెక్స్ 1,000, నిఫ్టీ 300 పాయింట్లు డౌన్

ఫెడ్ భావి నిర్ణయాలను ప్రభావితం చేసే అమెరికా ఉద్యోగ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు కోల్పోయి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్ల నష్టంతో 24,852 వద్ద నిలిచాయి. FIIలు తమ అసెట్ మేనేజ్మెంట్ వివరాలు వెల్లడించాలన్న సెబీ డెడ్లైన్ కూడా ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమని తెలుస్తోంది.
Similar News
News January 8, 2026
ప.గో: యువకుడి ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉండిలో చోటుచేసుంది. ఉండి శివారు ఉప్పగుంట వద్ద చేపల చెరువు వద్ద పనిచేస్తున్న దీప్ జ్యోతి బాస్మతి (21) చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా మృతుడు తన తండ్రి సుకుమార్తో కలిసి ఉండిలో ఓ చేపలచెరువు వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI నసీరుల్లా తెలిపారు.
News January 8, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ రెనెవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (<
News January 8, 2026
పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల చిత్రపటాలు

పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.


