News September 6, 2024
సెన్సెక్స్ 1,000, నిఫ్టీ 300 పాయింట్లు డౌన్
ఫెడ్ భావి నిర్ణయాలను ప్రభావితం చేసే అమెరికా ఉద్యోగ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు కోల్పోయి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్ల నష్టంతో 24,852 వద్ద నిలిచాయి. FIIలు తమ అసెట్ మేనేజ్మెంట్ వివరాలు వెల్లడించాలన్న సెబీ డెడ్లైన్ కూడా ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమని తెలుస్తోంది.
Similar News
News September 16, 2024
నీరజ్ చోప్రా తాజా ట్వీటుకు మనూ భాకర్ స్పందన ఏంటంటే?
గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా త్వరగా కోలుకోవాలని షూటర్ మనూ భాకర్ ఆకాంక్షించారు. డైమండ్ లీగులో రజతంతో 2024లో ఈ సీజన్ను అద్భుతంగా ముగించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సీజన్లో నేనెంతో నేర్చుకున్నాను. నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా నా ఎడమచేతికి ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్రే ద్వారా తెలిసింది. మీ సపోర్టుకు థాంక్స్’ అన్న నీరజ్ ట్వీటుకు మను స్పందించడం నెటిజన్లను ఆకర్షించింది.
News September 16, 2024
75ఏళ్లలో అతి పెద్ద తుఫాన్.. చైనాలోకి ఎంట్రీ
పెను తుఫాను బెబింకా చైనాలోని షాంఘైలో తీరం దాటింది. దాన్ని కేటగిరీ-1 తుఫానుగా పేర్కొంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. 1949లో గ్లోరియా టైఫూన్ తర్వాత గడచిన 75 ఏళ్లలో ఈస్థాయి తుఫాను రాలేదని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో షాంఘైలో వందలాది విమానాలను రద్దు చేశారు. కాగా గత వారమే చైనాలో యాగీ తుఫాను తీరం దాటిన సంగతి తెలిసిందే.
News September 16, 2024
బాణసంచా పేలి భవనం ధ్వంసం.. ఏడుగురికి తీవ్ర గాయాలు!
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాణసంచా పేలి ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.