News July 3, 2024
మూడు నెలల్లో 5వేల పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

బీఎస్ఈ సెన్సెక్స్ 80వేల మార్క్ తాకడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. 57 రోజుల్లోనే 5వేల పాయింట్లు వృద్ధి చెంది 75వేల నుంచి 80వేల మార్క్ చేరుకోవడం విశేషం. జూన్ 9న ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెన్సెక్స్ 3వేల పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ చరిత్రలో అత్యంత వేగంగా 5వేల పాయింట్లు పెరిగిన జాబితాలో ఈ వృద్ధి మూడోస్థానంలో ఉంది. 2021లో 28రోజుల్లోనే 5 పాయింట్లు పెరిగాయి.
Similar News
News November 22, 2025
IIITకల్యాణిలో నాన్ టీచింగ్ పోస్టులు

IIITకల్యాణి, పశ్చిమబెంగాల్లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iiitkalyani.ac.in
News November 22, 2025
హనుమాన్ చాలీసా భావం – 17

తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయె సబ జగ జానా || హనుమంతుడి ఉద్దేశాన్ని పాటించిన విభీషణుడు లంకకు రాజయ్యాడు. ఆయన విజయానికి ఆంజనేయుడి సలహా, ఆశీర్వాదాలు ఎంతో తోడ్పడ్డాయి. ఇలా విభీషనుడిని ఆదుకున్నట్లే హనుమాన్ మనల్ని కూడా ఆదుకుంటాడు. ఎంతో విశ్వాసంతో ఆయన నామాన్ని, మంత్రాన్ని జపిస్తే.. వారిని సత్య మార్గంలో నడిపిస్తాడు. రాముడిని కొలిచేవారికి హనుమంతుని అండదండలు ఎప్పుడూ ఉంటాయని నమ్మకం.<<-se>>#HANUMANCHALISA<<>>
News November 22, 2025
T2OIWC-2026.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

భారత్, శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే మెన్స్ T2OIWCలో 20 జట్లు 4 గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. ఒక గ్రూపులో ఇండియా, పాక్, USA, నమీబియా, నెదర్లాండ్స్, రెండో గ్రూపులో ఆసీస్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ ఉంటాయని క్రిక్బజ్ వెల్లడించింది. మూడో గ్రూపులో ఇంగ్లండ్, విండీస్, ఇటలీ, బంగ్లాదేశ్, నేపాల్, నాలుగో గ్రూపులో సౌతాఫ్రికా, కివీస్, అఫ్గాన్, UAE, కెనడా ఉంటాయని తెలిపింది.


