News July 3, 2024
మూడు నెలల్లో 5వేల పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

బీఎస్ఈ సెన్సెక్స్ 80వేల మార్క్ తాకడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. 57 రోజుల్లోనే 5వేల పాయింట్లు వృద్ధి చెంది 75వేల నుంచి 80వేల మార్క్ చేరుకోవడం విశేషం. జూన్ 9న ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెన్సెక్స్ 3వేల పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ చరిత్రలో అత్యంత వేగంగా 5వేల పాయింట్లు పెరిగిన జాబితాలో ఈ వృద్ధి మూడోస్థానంలో ఉంది. 2021లో 28రోజుల్లోనే 5 పాయింట్లు పెరిగాయి.
Similar News
News December 23, 2025
అధికారులే అన్నీ చూసుకున్నారు.. సిట్ ప్రశ్నలపై చెవిరెడ్డి!

AP: తిరుమల కల్తీ నెయ్యి విషయంలో SIT ప్రశ్నలకు YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరైన జవాబు ఇవ్వలేదని తెలుస్తోంది. టెండర్ రూల్స్లో మార్పులపై ప్రశ్నించగా, అధికారులే చూసుకున్నారని చెప్పినట్లు సమాచారం. వారు చెబితేనే కొనుగోలు కమిటీ సిఫార్సులు ఆమోదించానని అన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న చెవిరెడ్డిని SIT 4గంటలపాటు విచారించింది. అప్పట్లో TTD కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఆయన ఉన్నారు.
News December 23, 2025
రూ.118 కోట్లలో సగం చెల్లించాల్సిందే.. ‘గీతం’కు హైకోర్టు షాక్

TG: హైకోర్టు ఆదేశాలతో HYD <<18584831>>గీతం<<>> యూనివర్సిటీకి అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో 8వేల మంది స్టూడెంట్స్ నష్టపోతున్నారని వర్సిటీ మరోసారి కోర్టుకు వెళ్లింది. రూ.118 కోట్ల బకాయిల్లో సగం కడితేనే కరెంట్ కనెక్షన్ పునరుద్ధరణకు ఆదేశిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని ఇటీవల వర్సిటీకి డిస్కం నోటిసులిచ్చిన విషయం తెలిసిందే.
News December 23, 2025
శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయంటే?

* శీతాకాలంలో పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గి చర్మం పొడిబారడం, మడమలు పగలడం వంటి సమస్యలు వస్తాయి.
* సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తామర వంటి చర్మ సమస్యల వల్ల కూడా మడమల పగుళ్లు ఏర్పడతాయి. డయాబెటిస్, థైరాయిడ్ పరిస్థితులు కూడా మడమలు పగుళ్లకు కారణమవుతాయి.
* ఈ సీజన్లో చాలా మంది తక్కువగా నీరు తాగుతారు. దీనివల్ల శరీరంలో తేమ లోపిస్తుంది. ఇలా చర్మం పొడిగా మారి మడమల పగుళ్లకు కారణమవుతుంది.


