News July 3, 2024

మూడు నెలల్లో 5వేల పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

image

బీఎస్ఈ సెన్సెక్స్ 80వేల మార్క్ తాకడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. 57 రోజుల్లోనే 5వేల పాయింట్లు వృద్ధి చెంది 75వేల నుంచి 80వేల మార్క్ చేరుకోవడం విశేషం. జూన్ 9న ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెన్సెక్స్ 3వేల పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ చరిత్రలో అత్యంత వేగంగా 5వేల పాయింట్లు పెరిగిన జాబితాలో ఈ వృద్ధి మూడోస్థానంలో ఉంది. 2021లో 28రోజుల్లోనే 5 పాయింట్లు పెరిగాయి.

Similar News

News December 28, 2025

శివాజీకి మహిళా కమిషన్ ప్రశ్నలివే..!

image

నిన్న మహిళా కమిషన్ శివాజీకి సంధించిన ప్రశ్నలు బయటకు వచ్చాయి.
*మహిళల డ్రెస్సింగ్ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది మీకు తెలియదా?
*మీ కామెంట్స్ మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి. మీ సమాధానం?
>తాను మాట్లాడిన రెండు అసభ్యపదాలకు సారీ చెబుతున్నానన్న శివాజీ.. <<18646239>>మిగతా<<>> స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారని సమాచారం.

News December 28, 2025

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. రేవంత్ విషెస్

image

TG: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ‘భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి. జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్’ అని ట్వీట్ చేశారు.

News December 28, 2025

మిరపలో ఆకుముడత నివారణకు చర్యలు

image

మిరప నారును పొలంలో నాటిన 15 రోజుల తర్వాత ప్రతి 2 వారాలకు ఒకసారి లీటరు నీటికి థయామిథాక్సామ్ 0.3గ్రా, ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా., పిప్రోనిల్ గ్రాన్యూల్స్ 0.2 గ్రా, పెగాసస్ 1.5mlలలో ఏదో ఒక మందును కలిపి పిచికారీ చేయాలి. వీటితో పాటు 10,000 ppm వేప మందును లీటరు నీటికి 2ml కలిపి స్ప్రే చేయాలి. ముడత వలన బలహీనపడ్డ మొక్కలకు లీటరు నీటికి 2 గ్రాముల ఫార్ములా- 4 మరియు 19:19:19ను నెల రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి.