News February 4, 2025
సెన్సెక్స్ 1100 జంప్: రూ.6లక్షల కోట్ల లాభం
స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,666 (+320), సెన్సెక్స్ 78,250 (+1110) వద్ద ట్రేడవుతున్నాయి. కొన్ని దేశాలపై టారిఫ్స్ను ట్రంప్ వాయిదా వేయడం, డాలర్ ఇండెక్స్ తగ్గడం, ఆసియా స్టాక్స్ పుంజుకోవడం, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లలో ర్యాలీయే ఇందుకు కారణాలు. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.6లక్షల కోట్ల సంపదను పోగేశారు. శ్రీరామ్ ఫైనాన్స్, LT, ADANI SEZ, BEL, TATAMO టాప్ గెయినర్స్.
Similar News
News February 4, 2025
నేషన్ బిల్డర్స్ అయిన ట్యాక్స్ పేయర్స్ అంటే మోదీకి గౌరవం: నిర్మల
దేశ నిర్మాతలైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలన్న ప్రధాని నరేంద్రమోదీ యత్నమే బడ్జెట్లో కల్పించిన రిలీఫ్ అని FM నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండేందుకు నాలుగేళ్లుగా వారితో నిరంతరం టచ్లో ఉన్నామని తెలిపారు. వారి అభిప్రాయాలను బట్టే చర్యలు తీసుకున్నామని వివరించారు. పాత పన్ను విధానం రద్దు చేయాలనుకోవడం లేదని, మినహాయింపులు కోరుకొనేవారు ఉపయోగించుకోవచ్చని సూచించారు.
News February 4, 2025
రతన్ టాటా యువ స్నేహితుడికి కీలక పదవి
దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా కంపెనీలో కీలక పదవి దక్కింది. స్ట్రాటజీస్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్, GMగా నియమితులైనట్లు శంతను LinkedInలో పోస్ట్ చేశారు. తన తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్లో పని చేసేటప్పుడు వైట్ షర్ట్, నేవీ కలర్ ఫ్యాంట్ ధరించేవారని పేర్కొన్నారు. ఆయన కోసం తాను కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూసేవాడినని చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
News February 4, 2025
కుంభమేళా తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదు: హేమామాలిని
ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదని BJP MP హేమామాలిని అన్నారు. కానీ కొందరు దీనిని పెద్దదిగా చూస్తున్నారని మండిపడ్డారు. ‘మేమూ కుంభమేళాకు వెళ్లి సంగం ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించాం. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరం. ఈ ఒక్క ఘటన తప్ప కుంభమేళా అద్భుతంగా కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. కాగా UP సర్కార్ కుంభమేళా మృతుల సంఖ్యను దాచిపెడుతోందని మాజీ CM అఖిలేశ్ ఆరోపించారు.