News March 5, 2025
సెన్సెక్స్ 850 పాయింట్లు అప్.. ₹5లక్షల కోట్ల లాభం

దేశీయ స్టాక్మార్కెట్లలో బలమైన కౌంటర్ ర్యాలీ జరుగుతోంది. ఆరంభం నుంచీ దూకుడు మీదున్న సూచీలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. నిఫ్టీ 22,369 (+286), సెన్సెక్స్ 73,836 (+850) వద్ద ట్రేడవుతున్నాయి. వరుసగా 10 సెషన్లు ఎరుపెక్కిన సూచీలు ఇవాళ గ్రీన్లో కళకళలాడుతుండటంతో మార్కెట్ వర్గాలు ఖుషీ అవుతున్నాయి. NIFTY NEXT50 ఏకంగా 1269pts ఎగిసింది. మదుపరుల సంపద రూ.5లక్షల కోట్లమేర పెరిగింది.
Similar News
News November 17, 2025
గంజాయి టెస్ట్.. స్పాట్లోనే రిజల్ట్స్!

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్’తో టెస్ట్ చేసి స్పాట్లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.
News November 17, 2025
గంజాయి టెస్ట్.. స్పాట్లోనే రిజల్ట్స్!

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్’తో టెస్ట్ చేసి స్పాట్లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.
News November 17, 2025
రేపు భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సా.6 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.


