News March 5, 2025
సెన్సెక్స్ 850 పాయింట్లు అప్.. ₹5లక్షల కోట్ల లాభం

దేశీయ స్టాక్మార్కెట్లలో బలమైన కౌంటర్ ర్యాలీ జరుగుతోంది. ఆరంభం నుంచీ దూకుడు మీదున్న సూచీలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. నిఫ్టీ 22,369 (+286), సెన్సెక్స్ 73,836 (+850) వద్ద ట్రేడవుతున్నాయి. వరుసగా 10 సెషన్లు ఎరుపెక్కిన సూచీలు ఇవాళ గ్రీన్లో కళకళలాడుతుండటంతో మార్కెట్ వర్గాలు ఖుషీ అవుతున్నాయి. NIFTY NEXT50 ఏకంగా 1269pts ఎగిసింది. మదుపరుల సంపద రూ.5లక్షల కోట్లమేర పెరిగింది.
Similar News
News April 16, 2026
మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News April 16, 2026
దక్షిణాదికి అన్యాయం జరగదు: మోదీ

డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని.. తమకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలనే భేదం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావడానికి వీల్లేదని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం చేసినట్టేనని అన్నారు. రాజకీయాల్లో తమ శక్తి చూపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని.. వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.
News April 16, 2026
YouTube షార్ట్స్కు బానిస అయ్యారా? ఇలా చేస్తే కనిపించవు..

కొంత మంది గంటల తరబడి యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తారు. అలాంటి వారి కోసం స్క్రీన్ టైమ్ తగ్గించేలా యూట్యూబ్ డిజేబుల్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని కోసం యూట్యూబ్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్లి టైమ్ మేనేజ్మెంట్ సెలక్ట్ చేసుకోవాలి. కింది భాగంలో ‘Shorts feed limit’ ఆన్ చేసి జీరో మినట్స్ ఎంచుకోవాలి. దీంతో మీకు ఇక షార్ట్స్ కనిపించవు. తిరిగి చూడాలి అనుకుంటే Shorts feed limit ఆఫ్ చేస్తే చాలు.


