News August 3, 2024

SEP 14న జాతీయ లోక్ అదాలత్

image

ఏలూరు జిల్లా కారాగారాన్ని శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సందర్శించారు. కారాగారంలో ఖైదీలకు అందిస్తున్న ఆహారం, నీరు, వైద్య సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసులలో ఉన్న ముద్దాయిలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ద్వారా ఉచితంగా కేసులు వాదిస్తామన్నారు. సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News February 6, 2026

ప.గో: వరి రైతులకు ‘ఎలుక గండం’

image

ప.గో. జిల్లాలో రబీ సాగు చేస్తున్న రైతులు ఎలుకల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2.25 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిన రెండో వారం నుంచే తెగుళ్లు, ఎలుకలు పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి నిర్మూలనకు హెక్టారుకు రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అధికారులు సామూహిక చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదని సాగుదారులు ఆరోపిస్తున్నారు.

News February 6, 2026

ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

image

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.

News February 6, 2026

ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

image

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.