News September 25, 2024
వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే కీలక నిర్ణయం

వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన చోట అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు ‘రైల్ రక్షక్ దళ్’ను ఏర్పాటు చేసింది. దీని కోసం ఉద్యోగులకు అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్లో దీనిని ప్రారంభించింది.
Similar News
News November 17, 2025
ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్లో మొబైళ్లు, కాన్పూర్లో సిమ్ల కొనుగోలు

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్కు సోదరుడు.
News November 17, 2025
ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్లో మొబైళ్లు, కాన్పూర్లో సిమ్ల కొనుగోలు

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్కు సోదరుడు.
News November 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 69 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శివుడికి ‘నీలకంఠుడు’ అని ఎందుకు అంటారు?
సమాధానం: పాల సముద్రాన్ని మథించేటప్పుడు భయంకరమైన విషం వెలువడింది. దాన్ని హాలాహలం అని అంటారు. సమస్త లోకాల సంరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో (గొంతులో) ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అలా శివుడు నీలకంఠుడు అయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


