News September 25, 2024

వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే కీలక నిర్ణయం

image

వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన చోట అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు ‘రైల్ రక్షక్ దళ్’ను ఏర్పాటు చేసింది. దీని కోసం ఉద్యోగులకు అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో దీనిని ప్రారంభించింది.

Similar News

News September 25, 2024

రేపటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్

image

తెలంగాణలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ప్రొవిజినల్ జాబితాను కాళోజీ వర్సిటీ ఇవాళ విడుదల చేయనుంది. రేపు తుది మెరిట్ లిస్ట్‌ విడుదల కానుంది. గురువారం నుంచి రాష్ట్రంలో ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

News September 25, 2024

సెప్టెంబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1920: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జననం
1939: బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం
1974: ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురగదాస్ జననం
1958: స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం
2019: హాస్యనటుడు వేణుమాధవ్ మరణం
2020: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం మరణం
➣వరల్డ్ ఫార్మాసిస్ట్ డే

News September 25, 2024

ఒకే చట్టం పరిధిలోని యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు

image

AP: రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో యూనివర్సిటీ వీసీలను నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కరికులమ్ మార్పునకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.