News October 26, 2024

సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది: రోహిత్

image

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోల్పోవడం తీవ్ర నిరాశ కలిగించిందని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఇది తమ వైఫల్యమేనని ఆయన చెప్పారు. వాంఖడేలో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామన్నారు. కివీస్ అద్భుతంగా ఆడిందని ప్రశంసించారు. కాగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 రన్స్ తేడాతో ఓడి సిరీస్ కోల్పోయింది. అదే సమయంలో 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ చేజార్చుకుంది.

Similar News

News November 23, 2025

రేపు ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వెళ్తారు. అక్కడ కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

News November 23, 2025

CM రేసులో నేనూ ఉన్నా: కర్ణాటక హోం మంత్రి

image

కర్ణాటకలో సీఎం మార్పు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడిని సీఎం చేయాలని డిమాండ్లు వస్తున్నందున తాను కూడా రేసులో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఈ విషయంపై AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే ఇప్పటివరకు సీఎం మార్పుపై అధిష్ఠానం చర్చించలేదన్నారు.

News November 23, 2025

బంధువుల ఇంట్లో ఏ దిశన తలపెట్టి పడుకోవాలి?

image

బంధువుల ఇళ్లకు వెళ్తే తూర్పు దిశన తల, పడమర దిశకు కాళ్లు పెట్టి పడుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీని వలన సుఖ నిద్ర లభిస్తుందని అంటున్నారు. ఉదయం తేలికగా నిద్ర లేవవచ్చని తెలుపుతున్నారు. ‘ఇది తాత్కాలిక నివాసానికి, ఇతరులకు ఇబ్బంది లేకుండా అనుకున్న సమయానికి మేల్కొనడానికి దోహదపడుతుంది. మంచి విశ్రాంతి కోసం ఈ దిశను వాస్తుశాస్త్రం సిఫార్సు చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>