News July 28, 2024

వరుస ఉగ్రదాడులు.. జమ్మూకు 2,000 మంది జవాన్లు

image

ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జమ్మూలోని రాజౌరీ, పూంచ్, కఠువా, ఉధంపుర్‌ జిల్లాల్లో జరిగిన ఘటనలు కలవరపెడుతున్నాయి. దీంతో కేంద్రం ఆ ప్రాంతాలకు 2వేలకు పైగా అదనపు BSF సిబ్బందిని తరలిస్తోంది. ఒడిశాలో మావో ఆపరేషన్లలో ఉన్న వారిని జమ్మూకు పంపుతోంది. కాగా ఈ ఏడాది ఉగ్రదాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News November 18, 2025

ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

image

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 18, 2025

ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

image

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 17, 2025

గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

image

TG: గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.