News July 28, 2024

వరుస ఉగ్రదాడులు.. జమ్మూకు 2,000 మంది జవాన్లు

image

ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జమ్మూలోని రాజౌరీ, పూంచ్, కఠువా, ఉధంపుర్‌ జిల్లాల్లో జరిగిన ఘటనలు కలవరపెడుతున్నాయి. దీంతో కేంద్రం ఆ ప్రాంతాలకు 2వేలకు పైగా అదనపు BSF సిబ్బందిని తరలిస్తోంది. ఒడిశాలో మావో ఆపరేషన్లలో ఉన్న వారిని జమ్మూకు పంపుతోంది. కాగా ఈ ఏడాది ఉగ్రదాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News October 27, 2025

రేపు విజయవాడలో భారీ వర్షాలు.. బయటకు రావొద్దని వార్నింగ్

image

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 16 CMలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, మాల్స్ మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, మిల్క్ దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు.
*కలెక్టరేట్ కంట్రోల్ నం.9154970454

News October 27, 2025

వాహనదారులూ.. ఇది తప్పక తెలుసుకోండి!

image

మీరు నడిపే వాహనం టైర్లకు సంబంధించిన గరిష్ఠ వేగ పరిమితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైర్‌పై రాసి ఉన్న కోడ్‌లోని చివరి అక్షరం దాని వేగ పరిమితిని సూచిస్తుంది. L ఉంటే 120kmph, N- 140kmph, P- 150kmph, Q- 160kmph, R- 170kmph, S- 180kmph, T- 190kmph, H- 210kmph, V- 240kmph, W- 270kmph, Y- 300kmph వేగం వరకే వెళ్లాలి. లిమిట్‌ను మించి వేగంగా ప్రయాణిస్తే టైర్ పేలిపోయే ప్రమాదం ఉంది. SHARE IT

News October 27, 2025

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.