News April 5, 2025
పాస్టర్ ప్రవీణ్ మృతిపై తీవ్ర ఆరోపణలు.. హర్ష కుమార్పై కేసు నమోదు

AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ MP హర్ష కుమార్పై తూ.గో.(D) రాజానగరం పోలీసులు BNS సెక్షన్లు 196, 197 కింద FIR నమోదు చేశారు. ప్రవీణ్ను చంపి పడేశారని, పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఇటీవల ఆయన ఆరోపించారు. దీంతో విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు హాజరు కాకపోగా, మళ్లీ అదేస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో తాజాగా కేసు నమోదు చేశారు.
Similar News
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 18, 2025
10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని TTD తెలిపింది. నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వీరికి మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతిస్తారని పేర్కొంది. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుందని వెల్లడించింది. పది రోజుల్లో 182 గంటలు దర్శన సమయం ఉంటుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు అనుమతిస్తామని పేర్కొంది.


