News November 1, 2024

సర్వర్ డౌన్.. పెన్షన్ల పంపిణీకి బ్రేక్

image

ఏపీ వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా సర్వర్ సమస్య తలెత్తింది. అన్ని జిల్లాల్లో పంపిణీని సచివాలయ ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం అందిస్తున్నారు.

Similar News

News December 11, 2025

భూపాలపల్లి: ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికల ప్రక్రియ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, పోలీసులు సమన్వయంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని తెలిపారు. మొత్తం 107690 ఓటర్లు ఉండగా, వారిలో 88588 మంది ఓటర్లు ఓటు హక్కు విజయోగించు కున్నారని, 82.26 శాతం ఓటింగ్ జరిగిందని అన్నారు.

News December 11, 2025

చనిపోయిన సర్పంచి అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

image

TG: మరణించిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి పలువురు అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. ఇవాళ జరిగిన పోలింగ్‌లో బుచ్చిరెడ్డికి 165 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి మరణించినా ఓటు వేయడం గమనార్హం.

News December 11, 2025

ఇంటికి ఒకే ద్వారం ఉండవచ్చా?

image

పెద్ద ఇంటికి ఒకే ద్వారం నియమం వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘గుడికి ఒకే ద్వారం ఉంటుంది. కిటికీలు ఉండవు. ఇల్లు కూడా అలాగే ఉండవచ్చు కదా? అని చాలామంది అనుకుంటారు. కానీ ఇళ్లు, ఆలయాలు ఒకటి కాదు. వాస్తు నియమాలు వేర్వేరుగా ఉంటాయి. ఇంట్లో మనుషులు నివసిస్తారు కాబట్టి రాకపోకలకు, గాలి, వెలుతురుకు ద్వారాలు, కిటికీలు తప్పనిసరి, చిన్న ఇంటికి ఓ ద్వారం ఉన్నా పర్లేదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>