News November 1, 2024

సర్వర్ డౌన్.. పెన్షన్ల పంపిణీకి బ్రేక్

image

ఏపీ వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా సర్వర్ సమస్య తలెత్తింది. అన్ని జిల్లాల్లో పంపిణీని సచివాలయ ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం అందిస్తున్నారు.

Similar News

News December 22, 2025

అమ్మాయికి ఈ టెస్టులు చేయించండి..

image

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారి ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్, థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్‌ టెస్ట్‌, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.

News December 22, 2025

ఇంట్లో వెండి శివలింగం ఎందుకు ఉండాలి?

image

వెండి శుక్రుడు, చంద్రుడికి ప్రతీక. వెండి శివలింగ నిత్యారాధన ఆర్థిక బాధలు తొలగించి ఐశ్వర్యాన్ని ఇస్తుందని నమ్మకం. అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తిని పంపి, కుటుంబంలో మానసిక ప్రశాంతతను, అన్యోన్యతను పెంచుతుందని విశ్వాసం. చంద్ర దోషం ఉన్నవారు, మానసిక ఒత్తిడితో బాధపడేవారు, సంతాన సమస్యలున్నవారు దీనిని పూజించాలట. తద్వారా శుభ ఫలితాలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. శివలింగారాధన ధైర్యాన్నిస్తుంది.

News December 22, 2025

వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు – కలుపు నివారణ

image

వరి మాగాణుల్లో మొక్కజొన్న విత్తాక కలుపు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కిలో అట్రజిన్ 50% పొడి మందును కలిపి పంట విత్తిన 48 గంటలలోపు నేలంతా తడిచేట్లు పిచికారీ చేయాలి. వరి దుబ్బులు తిరిగి చిగురించకుండా 200 లీటర్ల నీటిలో లీటరు పారాక్వాట్ కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. దీని వల్ల విత్తిన 20-25 రోజుల వరకు ఎలాంటి కలుపు రాదు. అట్రజిన్+పారాక్వాట్ కలిపి కూడా పిచికారీ చేయవచ్చు.