News November 1, 2024
సర్వర్ డౌన్.. పెన్షన్ల పంపిణీకి బ్రేక్

ఏపీ వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా సర్వర్ సమస్య తలెత్తింది. అన్ని జిల్లాల్లో పంపిణీని సచివాలయ ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం అందిస్తున్నారు.
Similar News
News December 22, 2025
కేసీఆర్ హయాంలో ఎంవోయూలు గ్రౌండ్ కాలేదేమో: కందుల

APలో పెట్టుబడుల MOUలపై కేసీఆర్ చేసిన <<18634035>>విమర్శలకు<<>> మంత్రి కందుల దుర్గేశ్ కౌంటరిచ్చారు. ఆయన హయాంలో MOUలు గ్రౌండ్ కాలేదేమో కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదని చురకలంటించారు. ఆయన ఏదో విమర్శించాలని మాట్లాడుతున్నారు తప్ప విషయం లేదన్నారు. రూ.లక్షల కోట్లకు MOUలు జరిగితే రూ.10వేల కోట్లయినా రావాలిగా అని KCR వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
News December 22, 2025
ALERT: పిల్లల ఆధార్ను అప్డేట్ చేశారా?

పిల్లల ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ అప్డేట్ చేయడం తప్పనిసరి అని UIDAI పేర్కొంది. 5- 15 ఏళ్లు నిండిన పిల్లలకు స్కూల్ అడ్మిషన్లు, ఎగ్జామ్స్, ప్రభుత్వ పథకాల్లో ఇబ్బందులు రావొద్దంటే ఫింగర్ప్రింట్స్, ఫొటో అప్డేట్ చేయాలని సూచించింది. తల్లిదండ్రులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని X ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వరకూ ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.
News December 22, 2025
మహిళలకు విజయ డెయిరీ పార్లర్ల నిర్వహణ!

TG: మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలానికి ఒకటి, మున్సిపాలిటీకి 2చొప్పున మంజూరు చేయనున్నట్లు సమాచారం. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి. సభ్యులు రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, స్థలం ఏర్పాటు అనంతరం రూ.5,000 చెల్లిస్తే పార్లర్ మంజూరు చేస్తారు. రూ.5 లక్షల వరకు ఖర్చు అవనుండగా సర్కార్ లోన్ ఇవ్వనుంది.


