News November 1, 2024
సర్వర్ డౌన్.. పెన్షన్ల పంపిణీకి బ్రేక్

ఏపీ వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా సర్వర్ సమస్య తలెత్తింది. అన్ని జిల్లాల్లో పంపిణీని సచివాలయ ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం అందిస్తున్నారు.
Similar News
News December 10, 2025
ఐబీపీఎస్ SO, PO ఫలితాలు విడుదల

IBPS నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) మెయిన్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <
News December 10, 2025
‘మిస్టర్ ఇండియా’గా CISF జవాన్

జైపూర్(RJ)లో జరిగిన 6వ మిస్టర్ ఇండియా 2025 ఛాంపియన్షిప్లో CISF కానిస్టేబుల్ రిషిపాల్ సింగ్ అద్భుత విజయం సాధించారు. ఆయన ‘మిస్టర్ ఇండియా’ ట్రోఫీతో పాటు 50+ వయస్సు & 65–70 కేజీల బాడీబిల్డింగ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ గెలిచారు. రిషిపాల్ సింగ్ అంకితభావం & క్రమశిక్షణ ఫోర్స్కు గర్వకారణమని CISF ప్రశంసించింది. ఈ విజయం జాతీయ స్థాయిలో CISFకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని కొనియాడింది.
News December 10, 2025
పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

AP: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని పేర్కొంది. FIR నమోదు చేయాలని సూచించింది. మాజీ AVSO పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో CID, ACB అధికారులు వేర్వేరుగా విచారణ చేయొచ్చని తెలిపింది. కేసు వివరాలను ED, ITకి అందజేయాలంది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.


