News November 1, 2024
సర్వర్ డౌన్.. పెన్షన్ల పంపిణీకి బ్రేక్

ఏపీ వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా సర్వర్ సమస్య తలెత్తింది. అన్ని జిల్లాల్లో పంపిణీని సచివాలయ ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం అందిస్తున్నారు.
Similar News
News December 22, 2025
HYD: పదేపదే బెదిరింపులు.. తనిఖీల్లో వేగం పెంపు

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు బాంబు బెదిరింపులు వరుసగా వస్తున్నాయి. కేవలం ఒక నెలలోనే ఏడుసార్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్కు వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపడంతో భద్రతా చర్యలలో భాగంగా విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సంపూర్ణ తనిఖీలు నిర్వహించారు.
News December 22, 2025
అన్నమయ్య: కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీదారులు జిల్లా కలెక్టరేట్కు రావాల్సిన అవసరం లేకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితిగతుల సమాచారం కోసం మీకోసం కాల్ సెంటర్ నంబర్ 1100 ను సంప్రదించవచ్చన్నారు.
News December 22, 2025
విశాఖ ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


