News November 1, 2024
సర్వర్ డౌన్.. పెన్షన్ల పంపిణీకి బ్రేక్

ఏపీ వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా సర్వర్ సమస్య తలెత్తింది. అన్ని జిల్లాల్లో పంపిణీని సచివాలయ ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం అందిస్తున్నారు.
Similar News
News December 17, 2025
స్పీకర్ నిర్ణయంతో BRSకు షాక్

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న <<18592868>>MLA<<>>లపై అనర్హత వేటు పడితే ఉపఎన్నికలు వస్తాయని BRS ఆశించింది. అందుకోసం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాడుతోంది. కానీ తాజాగా స్పీకర్.. ఐదుగురు MLAలకు క్లీన్చిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయంతోనే ఏకీభవించనుంది. దీంతో ఉపఎన్నికల్లో గెలుస్తామని భావించిన కారు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా ఇప్పటికే 2 ఉపఎన్నికల్లో BRS ఓటమిపాలైన విషయం తెలిసిందే.
News December 17, 2025
AIతో అసభ్యకర ఫొటోలు.. బాధించాయన్న శ్రీలీల

ఏఐ సాయంతో SMలో తన ఫొటోలను అసభ్యంగా ఎడిట్ చేయడంపై హీరోయిన్ శ్రీలీల స్పందించారు. ఏఐని అసభ్యత కోసం వినియోగించడాన్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడిస్తూ కోరారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ జీవితాన్ని మరింత సులభతరం చేయాలని, ఇబ్బందులు సృష్టించొద్దని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏఐని తప్పుగా వినియోగించడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా నిలవాలని అభిమానులను ఆమె కోరారు.
News December 17, 2025
MLAలకు స్పీకర్ క్లీన్చిట్.. నెక్స్ట్ ఏంటి?

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ ప్రసాద్ ఐదుగురు <<18592868>>MLA<<>>ల వాదనలతో ఏకీభవించారు. తాము ముఖ్యమంత్రిని కలిసిన మాట నిజమేనని కానీ పార్టీ మారలేదని, కండువా కప్పుకోలేదని వారు స్పష్టం చేశారు. నిధుల కోసం CMను కలవడంలో తప్పు లేదని వాదించారు. దీంతో వారు పార్టీ మారినట్లు BRS చేసిన ఆరోపణలను స్పీకర్ కొట్టేశారు. ఫలితంగా వారు MLAలుగా కొనసాగనున్నారు. ఇదే విషయాన్ని రేపు అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టుకు తెలపనున్నారు.


