News September 20, 2024
‘మీసేవ’లో సర్వర్ సమస్యలు.. ప్రజలకు ఇబ్బందులు
TG: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వారాలుగా ‘మీసేవ’ సర్వర్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. క్యాస్ట్, ఇన్కమ్, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్లు డౌన్లోడ్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని 5,216 మీసేవా కేంద్రాల ద్వారా 38 శాఖలకు చెందిన 204 రకాల సేవలు అందుతున్నాయి.
Similar News
News September 20, 2024
కొత్త రేషన్ కార్డులపై రేపే తుది నిర్ణయం!
TG: కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం రేపు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై తుదినిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసాపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
News September 20, 2024
‘రూ.99కే క్వార్టర్ మద్యం’పై స్పష్టత కోరిన కంపెనీలు
AP: నూతన మద్యం పాలసీలో భాగంగా మంచి బ్రాండ్లు క్వార్టర్ రూ.99కే అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గందరగోళం నెలకొంది. ఇది అన్ని బ్రాండ్లకూ ఎలా వర్తిస్తుందని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ రేటుకు సరఫరా సాధ్యం కాదంటున్నాయి. అన్ని రకాల మద్యం తక్కువ ధరకే వస్తుందని వినియోగదారులు భావిస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని లిక్కర్ సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు కామేశ్వరరావు కోరారు.
News September 20, 2024
కాంగ్రెస్కే మొగ్గు.. బీజేపీకి ఎదురుగాలే: కేకే
AP ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన ‘కేకే సర్వేస్’ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సర్వే చేసింది. హరియాణాలో INCకే విజయావకాశాలు ఉన్నాయని, BJPకి ఎదురుగాలి వీస్తోందని ఆ సంస్థ MD కిరణ్ కొండేటి తెలిపారు. OCT 5న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న J&K, త్వరలో ఎలక్షన్స్ జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ కమలం పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.