News January 21, 2025

సోలార్ సెల్ ప్లాంట్‌ను ఏపీలో పెట్టండి: లక్ష్మీ మిట్టల్‌తో మంత్రి లోకేశ్

image

AP: దావోస్‌లోని బెల్వేడార్‌లో మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. భావనపాడును పెట్రోకెమికల్ హబ్‌గా మార్చడానికి పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. పెట్రో కెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. రూ.3,500 కోట్లతో భారత్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న 2GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో నెలకొల్పాలని కోరారు.

Similar News

News November 19, 2025

ఈవీల విక్రయాల్లో MG విండ్సర్ రికార్డ్

image

ఈవీ కార్ల అమ్మకాల్లో MG విండ్సర్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారత్‌లో 400 రోజుల్లోనే 50వేల యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. నెలకు 3,800పైగా కార్ల చొప్పున విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. భారతీయ మార్కెట్లో అత్యంత వేగంగా 50వేల మార్కును అందుకున్న ఫోర్ వీలర్ ఈవీగా నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన MG.. ఇండియాలో JSWతో జతకట్టి తమ కార్ల విక్రయాలు ప్రారంభించింది.

News November 19, 2025

సూసైడ్ బాంబర్ వీడియోలు తొలగించిన META

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో SMలో వైరలైన విషయం తెలిసిందే. వాటిని META సంస్థ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించింది. తమ యూజర్ గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘నాది ఆత్మహత్య కాదు.. <<18318092>>బలిదానం<<>>’ అని ఉమర్ ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. అయితే ఈ వీడియో ట్విటర్‌లో అందుబాటులోనే ఉండటం గమనార్హం.

News November 19, 2025

త్వరలో పంచాయతీ ఎన్నికలు.. ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్

image

TG: గ్రామ పంచాయతీల్లో ఓటరు సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. సెప్టెంబర్ 2న ప్రచురితమైన జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే రేపు(ఈ నెల 20) అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిపై DPO పరిశీలన చేస్తారని పేర్కొంది. ఈ నెల 23న తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని వెల్లడించింది. త్వరలోనే GP ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.