News February 4, 2025

AI సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని APలో ఏర్పాటు చేయండి: లోకేశ్

image

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఢిల్లీలో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో రాష్ట్రంలో తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు. ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. AI సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని APలో ఏర్పాటు చేయాలని కోరారు. AI అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని లోకేశ్ కోరారు.

Similar News

News December 13, 2025

పాల మొదటి 2 ధారలు, గోటి పరీక్ష ముఖ్యం

image

☛ కొన్ని గేదెల పొదుగు పెద్దగా ఉన్నా లోపల పొదుగు వాపు ఉండే ఛాన్సుంది. అందుకే నల్లటి గిన్నెలో పాలను పితికి మొదటి రెండు ధారలను పరిశీలించాలి. అందులో గడ్డలు, రక్తం లేదా నీళ్ల విరుగుడు కనిపిస్తే ఆ గేదెను కొనవద్దు.
☛ మెషిన్ లేకుండానే పాలలో వెన్నశాతం చెక్ చేయాలి. దీనికి పాలు పితికిన వెంటనే ఒక చుక్కపాలను బొటన వేలు గోరు మీద వేయాలి. ఆ చుక్క జారిపోకుండా గోరు మీదే ఉంటే అవి చిక్కటి పాలుగా గుర్తించాలి.

News December 13, 2025

దోషాలను తొలగించే ‘కూష్మాండ దీపం’

image

ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే అఖండ ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. దృష్టి, నర, శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘ఈ దీపం వెలిగించడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. చండీ హోమంతో సమానమైన ఫలితం దక్కుతుంది. ఆర్థిక, ఆరోగ్య, సంతాన సమస్యలను తొలగించుకోవడానికి ఈ పరిహారం పాటించాలి’ అని సూచిస్తున్నారు. కూష్మాండ దీపాన్ని ఎప్పుడు, ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News December 13, 2025

నిద్రలో పళ్లుకొరుకుతున్నారా?

image

నిద్రలో కొంద‌రు ప‌ళ్ల‌ను కొరుకుతుంటారు. దీన్ని బ్ర‌క్సిజం అంటారు. ఎక్కువ ఆందోళ‌న‌, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్త‌త ఎక్కువ‌గా ఉంటే నిద్ర‌లో ఇలా ప‌ళ్లు కొరుకుతార‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్నారుల్లో పేగుల్లో పురుగులు ఉన్నా, కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నా వారు నిద్ర‌లో ప‌ళ్ల‌ను కొరుకుతారని అంటున్నారు. అందుకే చిన్నారుల‌కు పోష‌కాహారం ఇస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చని చెబుతున్నారు.