News July 29, 2024
భోజనం పెట్టిన ఇంటికి నిప్పు పెట్టడం బీఆర్ఎస్ లక్షణం: CM రేవంత్

చంద్రబాబుకు తాను శిష్యుడినంటూ BRS చేసే ఆరోపణలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘తెలంగాణలో ఎవరైనా గ్లాసుడు మంచినీళ్లిస్తే కూడా గుర్తుపెట్టుకుంటాం. పది పదిహేనేళ్లు కలిసి పనిచేసిన సహచరుల్ని తిట్టాలని ఎక్కడైనా ఉందా? మిత్రుల్ని మిత్రుల్లాగా, సహచరుల్ని సహచరుల్లాగా, పెద్దవారిని గౌరవించేలా మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పారు. భోజనం పెట్టిన ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన వారి DNAలోనే ఉంది’ అని విరుచుకుపడ్డారు.
Similar News
News January 8, 2026
ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్

TG: ఏప్రిల్లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు.
News January 8, 2026
నేడు ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం

విష్ణువుకు ఇష్టమైన గురువారం నాడు పసుపు రంగు వస్తువులు దానమిస్తే జాతకంలో బృహస్పతి దోషాలు తొలగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. పేదలకు పసుపు వస్త్రాలు, పప్పు ధాన్యాలు, అరటిపండ్లు, పసుపు మిఠాయిలను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా, ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. స్తోమతను బట్టి చేసే దానం, విష్ణుమూర్తి కృపతో శుభాలను చేకూరుస్తుంది.
News January 8, 2026
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ను జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గువాహటి-కోల్కతా రూట్లో 18 నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. 16 కోచ్లు, 823 సీట్లు కలిగిన ఈ ట్రైన్లో విమాన తరహా సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రయాణికుల కోసం టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. గంటకు 180 KM వేగంతో దూసుకెళ్లనుంది.


