News July 29, 2024
భోజనం పెట్టిన ఇంటికి నిప్పు పెట్టడం బీఆర్ఎస్ లక్షణం: CM రేవంత్

చంద్రబాబుకు తాను శిష్యుడినంటూ BRS చేసే ఆరోపణలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘తెలంగాణలో ఎవరైనా గ్లాసుడు మంచినీళ్లిస్తే కూడా గుర్తుపెట్టుకుంటాం. పది పదిహేనేళ్లు కలిసి పనిచేసిన సహచరుల్ని తిట్టాలని ఎక్కడైనా ఉందా? మిత్రుల్ని మిత్రుల్లాగా, సహచరుల్ని సహచరుల్లాగా, పెద్దవారిని గౌరవించేలా మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పారు. భోజనం పెట్టిన ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన వారి DNAలోనే ఉంది’ అని విరుచుకుపడ్డారు.
Similar News
News November 2, 2025
‘బాహుబలి-ది ఎపిక్’ కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు పార్టులు కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ తొలి రోజు(OCT 31) థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.19.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా రూ.12.95Cr రాబడితే విదేశాల్లో రూ.6.65 కోట్లు కలెక్ట్ చేసిందని వెల్లడించాయి. మీరు మూవీ చూశారా?
News November 2, 2025
పసుపుతో అందమైన పెదాలు

ముఖ సౌందర్యంలో పెదాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేచురల్గా అందంగా ఉంచాలంటే ఈ టిప్స్ పాటించండి. * పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. * చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి.
News November 2, 2025
విజయవాడకు జోగి రమేశ్ తరలింపు!

AP: కల్తీ మద్యం కేసులో <<18175333>>అరెస్టైన<<>> మాజీ మంత్రి జోగి రమేశ్ను పోలీసులు విజయవాడకు తరలించారు. ఎక్సైజ్ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆయనను విచారించనున్నారు. మరోవైపు జోగి రమేశ్ అరెస్టుతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.


