News October 4, 2024

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ హతం

image

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆటోమేటిక్ గన్లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

Similar News

News October 7, 2024

రేపు కోర్టుకు హీరో నాగార్జున

image

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. తన స్టేట్‌మెంట్ తెలిపేందుకు రేపు కోర్టుకు రావాలని న్యాయస్థానం నాగార్జునను ఆదేశించింది. ఈమేరకు విచారణను రేపటికి వాయిదా వేసింది.

News October 7, 2024

‘మహారాజ’ దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్

image

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’ చిత్రం 100 డేస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్‌‌కు నిర్మాతలు సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. ఖరీదైన BMW కారును హీరో చేతుల మీదుగా అందించారు. ఈ మూవీ ₹110 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వ్యూస్‌లోనూ అదరగొట్టింది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి, నటరాజన్ కీలక పాత్రలు పోషించారు.

News October 7, 2024

ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రతన్ టాటా

image

బీపీ తగ్గడంతో తాను తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరానని వస్తోన్న వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. వృద్ధాప్యం దృష్ట్యా తాను జనరల్ చెకప్ కోసం మాత్రమే ఆస్పత్రికి వెళ్లినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని కోరారు.