News March 27, 2024
ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసులయ్యారు

బిహార్లోని ఛప్రా పట్టణానికి చెందిన కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఏడుగురు కుమార్తెలు పోలీసు ఉద్యోగాలను సాధించారు. ఆబ్కారీ శాఖ, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. తమ తల్లిదండ్రులు, తమ్ముడికి 4 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు ఆ భవనం ద్వారా వచ్చే అద్దెతో వారు హాయిగా జీవిస్తున్నారు.
Similar News
News April 10, 2026
భారీగా పెరగనున్న భూముల మార్కెట్ విలువ!

TG: త్వరలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగనుంది. 20% పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై క్యాబినెట్లో చర్చించి సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఆదాయ మార్గాలను పెంచేందుకు ఈ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక HMDA ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది.
News April 10, 2026
యూత్లో గుండె జబ్బులు.. భారంగా మారుతున్న ఇన్సూరెన్స్!

గతంలో 50 ఏళ్లు దాటాక వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20 ఏళ్లకే వస్తున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ ఎక్కువని భావించి ప్రీమియం ధరలను 50% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్లమ్ సంస్థ డేటా వెల్లడించింది. అంటే గతంలో కంటే ఇప్పుడు పాలసీ కోసం ఎక్కువ డబ్బులు కట్టాలి. అందుకే సరైన టైమ్లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆస్పత్రి ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వస్తుందంటున్నారు.
News April 10, 2026
‘భోగాపురం’ ప్రారంభానికి రండి.. మోదీకి CBN ఆహ్వానం

AP: జులై/ఆగస్టులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకకు రావాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. జులై 5 లేదా 8న, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో సమయం ఇవ్వాలని కోరారు. జూన్ 30 లోగా పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.


