News April 7, 2024
విరాట్ కోహ్లీ సెంచరీపై తీవ్ర విమర్శలు
నిన్న RRపై విరాట్ చేసిన సెంచరీపై విమర్శలు వస్తున్నాయి. సెంచరీకి కోహ్లీ 67 బంతులు తీసుకున్నారని, చివరి ఓవర్లలో సింగిల్స్ తీయడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ వేగంగా ఆడి ఉంటే స్కోర్ 200 దాటేదని, అతడిది స్వార్థపూరిత ఇన్నింగ్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే జట్టులో మిగతా ప్లేయర్లు ఏమాత్రం సపోర్ట్ చేయకపోయినా కోహ్లీ సూపర్ సెంచరీ చేశారని కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 9, 2024
వారు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చు: కోదండరెడ్డి
TG: అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
News October 9, 2024
నాగార్జునVSసురేఖ: ఈనెల 10న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు
తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.
News October 9, 2024
నేడు టీడీపీలో చేరనున్న మస్తాన్ రావు, మోపిదేవి
AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ నేడు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో వారిద్దరికి సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వీరిద్దరూ వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.