News August 22, 2024

‘సెజ్’ ఘటన కలచివేసింది: సీఎం చంద్రబాబు

image

AP: అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని CM చంద్రబాబు అన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని చెప్పారు. ‘గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. వాటిని బాగుచేసే క్రమంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. 17 మంది చనిపోయారు. 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి అందుతున్న వైద్యంపై నిత్యం సమీక్ష చేస్తున్నాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయిస్తాం’ అని తెలిపారు.

Similar News

News February 13, 2025

మోహన్ బాబుకు ముందస్తు బెయిల్

image

జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఊరట దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

News February 13, 2025

SnapChatలో రికార్డు సృష్టించారు!

image

మీరెప్పుడైనా స్నాప్‌చాట్ వాడారా? అందులో ఇద్దరు స్నేహితులు కలిసి స్నాప్ పంపించుకుంటే స్ట్రీక్ స్టార్ట్ అవుతుంది. రోజూ ఒక స్నాప్ (ఫొటో/వీడియో) పంపిస్తుంటే స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. ఇలా కాటీ &ఎరిన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ 3662+ స్ట్రీక్‌తో రికార్డు సృష్టించారు. అంటే వీరి స్నాప్ జర్నీ పదేళ్లు దాటిందన్న మాట. వీరి తర్వాత లెస్లీ & జయ్నబ్ (3536+), ఎర్మిరా & జవి (3528+) ఉన్నారు. మీ హైయెస్ట్ స్ట్రీక్స్ ఎంత?

News February 13, 2025

బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి.. బండి డిమాండ్

image

TG: రిజర్వేషన్ల అంశంలో బీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం నుంచి తిరుగుబాటు తప్పదని, MLC ఎన్నికల్లో INC మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల ఆధారంగా రిజర్వేషన్లకు BJP వ్యతిరేకమని స్పష్టం చేశారు. BC రిజర్వేషన్ల వ్యవహారాన్ని INC ప్రభుత్వం కేంద్రంపై నెట్టడానికి చూస్తోందని మండిపడ్డారు.

error: Content is protected !!