News July 1, 2024
పాకిస్థాన్ను గడగడలాడించిన అబ్దుల్ హమీద్కు షా నివాళులు
‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీత వీర్ అబ్దుల్ హమీద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా 1965 భారత్ -పాక్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఘటనను హోం మంత్రి గుర్తుచేసుకున్నారు. ఈ యుద్ధంలో శత్రువులకు చెందిన 7 యుద్ధ ట్యాంకులను హమీద్ ఒంటిచేత్తో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆయన ధైర్యసాహసాలు దేశప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని ట్వీట్ చేశారు.
Similar News
News July 3, 2024
DSC అభ్యర్థులకు BIG ALERT
AP: ఎన్నికలకు ముందు ప్రకటించిన DSCకి దరఖాస్తు చేసిన వారు మెగా DSCకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేశ్ వెల్లడించారు. మెగా DSC, TETకు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.
News July 3, 2024
రోహిత్కి బాల్ విసిరేద్దామనుకున్నా: సూర్య
T20WC ఫైనల్లో తాను అందుకున్నది క్లీన్ క్యాచ్ అని సూర్య కుమార్ స్పష్టం చేశారు. ‘సాధారణంగా రోహిత్ భాయ్ లాంగాన్లో ఫీల్డింగ్ చేయరు. కానీ అప్పుడు చేశారు. మిల్లర్ క్యాచ్ రోహిత్ తీసుకుంటారేమోనని ఒక్క క్షణం ఆయన వైపు చూశా. ఆయనా నా వైపు చూశారు. నేను పరిగెత్తుకెళ్లి క్యాచ్ అందుకున్నా. రోహిత్ నాకు దగ్గర్లో ఉంటే బంతిని అతడికి విసిరేద్దామనుకున్నా. కానీ సమీపంలో లేక నేనే మళ్లీ అందుకున్నా’ అని SKY చెప్పారు.
News July 3, 2024
TDP ఆఫీసుపై దాడి.. పోలీసుల అదుపులో నిందితులు
AP: మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో మంగళవారం అర్ధరాత్రి పలువురిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను రెండు, మూడు రోజులుగా సేకరించారు. CC కెమెరాల ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఇందులో గుంటూరుకి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసుల గాలింపు చర్యలతో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.