News September 3, 2025
శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్కు రానున్న షా

వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనేందుకు ఈ నెల 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఉ.11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని తొలుత పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. అనంతరం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద నిమజ్జన ఊరేగింపులో పాల్గొంటారు. మ.3.30 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో ప్రసంగిస్తారు.
Similar News
News September 21, 2025
H1B వీసా సమస్యను వెంటనే పరిష్కరించాలి: CM రేవంత్

TG: H1B వీసాపై ట్రంప్ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక ఇండో-అమెరికన్ సత్సంబంధాల్లో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదన్నారు. దీని వల్ల తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను కోరుతూ రేవంత్ ట్వీట్ చేశారు.
News September 20, 2025
కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.
News September 20, 2025
రేపటి నుంచే సెలవులు.. హైవేపై రద్దీ

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 22 నుంచి దసరా సెలవులు మొదలవనుండగా ఆదివారం కలిసి రావడంతో రేపటి నుంచే హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. దీంతో HYD-విజయవాడ హైవే వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతోంది. HYD నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి HYDకు రాకపోకలు సాగించేవారితో టోల్ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ఇక ఏపీలో వచ్చేనెల 3న, టీజీలో 4న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అప్పటివరకు విద్యార్థులు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు.