News July 22, 2024

ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ

image

మహారాష్ట్ర సీఎం, శివసేన లీడర్ ఏక్‌నాథ్ షిండేతో NCP(SP) చీఫ్ శరద్ పవార్ భేటీ అయ్యారు. ఎన్డీఏ సీఎంతో ఇండియా కూటమికి చెందిన లీడర్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించారనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 1, 2025

శ్రీకాంత్ మాల్డే, చార్మి బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఇదే

image

శ్రీకాంత్, చార్మి ఎప్పుడూ సాదా సీదా జీవితాన్ని గడపడం, కల్తీలేని ఆర్గానిక్ పద్ధతిని ఎంచుకోవడం, వినియోగదారులతో నిజాయితీగా వ్యవహరించడం చుట్టు పక్కల జనానికి, వారి దగ్గర పాల ఉత్పత్తులను కొనేవారికి బాగా నచ్చింది. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీతోనే వారి వ్యాపారం బాగా జరిగింది. ఫలితంగా రోజురోజుకీ వారి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి 2024 నాటికే రూ.2 కోట్ల టర్నోవర్ సాధించి, ఇప్పుడు మరింత ఆదాయం దిశగా దూసుకెళ్తున్నారు.

News December 1, 2025

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలపై దిత్వా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. రానున్న 3 రోజులు చలి గాలులు అధికంగా వీచే అవకాశముందని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.

News December 1, 2025

నేడు గీతా జయంతి

image

పురాణేతిహాసాలెన్ని ఉన్నా.. అవేవీ చదవకపోయినా ఒక్క భగవద్గీత చదివితే చాలంటారు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంథం ఆవిర్భవించింది ఈరోజే. అందుకే నేడు గీతా జయంతి జరుపుకొంటాం. ‘ఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తించు’ అనే సిద్ధాంతాన్ని గీత బోధిస్తుంది. మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది. జీవితంలో గీతా సారాన్ని ఆచరిస్తే పరాజయం ఉండదనడానికి మహాభారతమే నిదర్శనం. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.