News January 12, 2025
శరద్, ఉద్ధవ్ మోసపూరిత రాజకీయాలకు తెర: అమిత్ షా

NCP(SP) చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర వేదికగా 1978 నుంచి మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. సీఎంగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన రైతు ఆత్మహత్యలను ఆపలేకపోయారని దుయ్యబట్టారు. పవార్ విధానాలతోపాటు ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ, ద్రోహ రాజకీయాలకు 2024లో బీజేపీ విజయంతో తెరపడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శరద్, ఉద్ధవ్ల స్థానమేంటో ప్రజలు చూపించారని తెలిపారు.
Similar News
News January 22, 2026
జనవరి 22: చరిత్రలో ఈ రోజు

1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1885: ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
2014: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (ఫొటోలో)
News January 22, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 22, 2026
టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: లోకేశ్

జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్తో మంత్రి లోకేశ్ దావోస్లో భేటీ అయ్యారు. ‘ప్లాట్ఫామ్ ఇంజినీరింగ్, ట్రేడింగ్ అల్గారిథమ్స్పై దృష్టి సారిస్తూ విశాఖలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పండి. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకో సిస్టమ్ బలోపేతానికి లీడ్ మెంటర్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించండి. కాలేజ్ స్థాయి వరకు ఫైనాన్సియల్ లిటరసీ కార్యక్రమం అమలుకు సహకరించండి’ అని విజ్ఞప్తి చేశారు.


