News January 12, 2025
శరద్, ఉద్ధవ్ మోసపూరిత రాజకీయాలకు తెర: అమిత్ షా

NCP(SP) చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర వేదికగా 1978 నుంచి మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. సీఎంగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన రైతు ఆత్మహత్యలను ఆపలేకపోయారని దుయ్యబట్టారు. పవార్ విధానాలతోపాటు ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ, ద్రోహ రాజకీయాలకు 2024లో బీజేపీ విజయంతో తెరపడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శరద్, ఉద్ధవ్ల స్థానమేంటో ప్రజలు చూపించారని తెలిపారు.
Similar News
News December 4, 2025
సింగపూర్ లాంటి దేశాన్నీ ఇబ్బంది పెట్టారు: CM

AP: గత పాలకులు సింగపూర్ లాంటి దేశాన్ని, ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారని CM CBN విమర్శించారు. ‘ఆ బ్యాడ్ ఇమేజ్ చెరిపి బ్రాండ్ ఇమేజ్ తేవడంతో ఇపుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలి MOUలన్నీ 45 రోజుల్లో గ్రౌండ్ కావాలి. భూ సేకరణలో వివాదాలు రాకూడదు. భూములిచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు సంతోషంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు. UAE మాదిరి APలో ₹500 కోట్లతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
News December 4, 2025
టోల్ ప్లాజాస్ @ 25 ఇయర్స్

దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP)లో టోల్ ప్లాజాలు ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ప్రభుత్వ రహదారులు, బ్రిడ్జిలపై టోల్ వసూలుకు 1851లో చట్టం చేశారు. 1970లలో దేశంలో రహదారుల నిర్మాణం, టోల్ వసూలు పద్ధతులు ప్రవేశపెట్టారు. 2000 నుంచి ప్రారంభమైన టోల్ ప్లాజాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తోంది. 2024-25లో రూ.73 వేల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది రూ.80 వేల కోట్లు వసూలు కావొచ్చని అంచనా.
News December 4, 2025
‘అఖండ-2’ మూవీ.. ఫ్యాన్స్కు బిగ్ షాక్

అఖండ2 ప్రీమియర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్కు డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ఉండవని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ఓవర్సీస్లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ఉంటాయంది. ఇవాళ రాత్రి గం.8 నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చినా టికెట్స్పై సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.


