News October 3, 2024

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 వరకు 9 రోజుల్లో దుర్గమ్మ 9 రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజూ ఉ.4 నుంచి రా.11 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తొలిరోజైన నేడు మాత్రం ఉ.9 నుంచి దర్శనాలు ఆరంభమవుతాయి. భక్తుల కోసం 25 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. ఉచితంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. కృష్ణా ఘాట్ల వద్ద స్నానాల కోసం షవర్లు ఏర్పాటుచేశారు.

Similar News

News February 3, 2026

98.42% రూ.2వేల నోట్లు వెనక్కి వచ్చాయి: RBI

image

రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై RBI కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 98.42 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు RBI 2023 మే-19న ప్రకటించింది. అప్పుడు ప్రజల వద్ద రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లుండగా.. ఈ జనవరి 31 నాటికి అవి రూ.5,609 కోట్లకు చేరుకున్నాయి. ప్రజల వద్ద రూ.2 వేల నోట్లుంటే RBI కార్యాలయాల్లో డిపాజిట్ లేదా మార్చుకోవచ్చని సూచించింది.

News February 3, 2026

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ విజేత నొదిర్‌బెక్‌

image

ఉజ్బెకిస్థాన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ నొదిర్‌బెక్‌ అబ్దుసతారోవ్‌ ప్రతిష్ఠాత్మక ‘టాటా స్టీల్‌ మాస్టర్స్‌’ చెస్‌ టైటిల్‌ను గెలుచుకున్నారు. నెదర్లాండ్స్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశీని 13వ రౌండ్‌లో ఓడించి.. 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఈ మెగా టోర్నీని సొంతం చేసుకున్నారు. భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్‌ 6.5 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచారు.

News February 3, 2026

ధనుష్, సాయి పల్లవి జోడీగా మరో సినిమా

image

‘మారి 2’ సినిమాతో మెరిసిన ధనుష్, సాయి పల్లవి జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. అమరన్ మూవీతో సత్తాచాటిన రాజ్‌ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఈ జంట నటించనుంది. హీరో ధనుష్‌కు ఇది 55వ చిత్రం. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్‌గా శ్రీలీల ఎంపిక కాగా.. మరో కథానాయికగా సాయి పల్లవిని సెలక్ట్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.