News March 13, 2025

చేతిలో రూ.12 లక్షల విలువైన షేర్లు.. కానీ!

image

రతన్ అనే వ్యక్తికి 1992లో తన తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొన్న <<15725743>>షేర్స్<<>> అగ్రిమెంట్ పేపర్స్ దొరికిన విషయం తెలిసిందే. వీటి విలువ దాదాపు రూ.12లక్షలు అయినప్పటికీ షేర్స్‌ను డిజిటలైజ్ చేసేందుకు ఆయన ఇష్టపడట్లేదు. ‘డిజిటలైజ్ చేసేందుకు మూడేళ్లు పట్టేలా ఉంది. కేవలం వారసుడిగా సర్టిఫికెట్ పొందేందుకే 8నెలలు పడుతుంది. ఇంత సమయాన్ని దీనికోసం వృథా చేయను. ఇండియాలో ఈ ప్రక్రియ వ్యవధిని తగ్గించాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News November 3, 2025

రూ.500కే రూ.16 లక్షల ప్లాటు గెలిచింది

image

TG: లాటరీలో ఓ 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో తీసిన లక్కీ డ్రాలో రూ.500కే ఏకంగా రూ.16 లక్షల విలువైన ప్లాటును గెలుచుకుంది. రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి 66 గజాల ప్లాటుకు లక్కీ డ్రా నిర్వహించారు. శంకర్ అనే వ్యక్తి ఫ్యామిలీ పేరుతో 4 కూపన్లు తీసుకోగా.. 2307 అనే నంబరుతో కుమార్తె హన్సికకు ఈ బహుమతి దక్కింది. రూ.500కే ప్లాటు దక్కడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.

News November 3, 2025

Take A Bow: మనసులు గెలిచిన కెప్టెన్ లారా

image

భారత్ ఉమెన్స్ WCను లిఫ్ట్ చేసినప్పుడు గెలుపు గర్జనతో స్టేడియం మారుమోగింది. అంతా విజయోత్సాహంలో నిండిపోయారు. కానీ, SA కెప్టెన్ లారా ముఖంలో విషాదం నిండిపోయింది. ఫైనల్లో సెంచరీ సహా 9 మ్యాచుల్లో 571 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా SAకి తొలి WC అందించాలన్న తన కల సాకారం కాలేదు. అయితే ఆమె పోరాటం క్రికెట్ అభిమానుల మనసులు గెలిచింది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

News November 3, 2025

షెఫాలీ షో.. చరిత్ర సృష్టించింది

image

షెఫాలీ వర్మ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించారు. ఫైనల్లో 87 రన్స్ చేయడమే కాకుండా.. 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్ షెఫాలీ(21 ఇయర్స్) కావడం విశేషం. గాయపడిన ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన ఆమె అనూహ్యంగా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘ఏదో మంచి చేయాలనే భగవంతుడు నన్ను జట్టులోకి పంపాడు’ అంటూ షెఫాలీ ఆనందం వ్యక్తం చేశారు.