News August 18, 2024

మీ ట్రిప్ విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

image

TG: సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు షేర్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలా వివరాల్ని బయటపెట్టడం సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. ఏదైనా ట్రిప్‌కు వెళ్తే ఆ వివరాల్ని షేర్ చేయొద్దని చెబుతున్నారు. ఒకవేళ షేర్ చేస్తే నేరగాళ్లు రహస్యంగా కదలికల్ని గమనిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ఛాన్సుందని, ఆ తర్వాత వేధింపులకు గురిచేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News December 3, 2025

చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్

image

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 358/5 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(105) వన్డేల్లో తొలి సెంచరీ బాదారు. కోహ్లీ(102) వరుసగా రెండో వన్డేలోనూ శతకం నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో అర్ధసెంచరీ(66*) చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 2, బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీశారు.

News December 3, 2025

రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

image

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.

News December 3, 2025

లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

image

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.