News October 29, 2024
షర్మిలకు అన్యాయం జరిగింది: విజయమ్మ

AP: జగన్ CM అయ్యాక ఆస్తుల పంపకం ప్రపోజల్ పెట్టాడని తల్లి విజయమ్మ అన్నారు. ‘ఇప్పుడు ప్రచారంలో ఉన్న MOU జగన్ చేతితో రాసిందే. హక్కు ఉంది కాబట్టే షర్మిలకు రూ.200Cr డివిడెండ్లు ఇచ్చారు. MOUలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, అందులో లేని యలహంక ప్రాపర్టీ 100% షర్మిలకు వెంటనే ఇస్తానని మాట ఇచ్చి సంతకం పెట్టాడు. కానీ అవి ఇవ్వలేదు. పైగా అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలో పాపకు అన్యాయం జరిగింది’ అని ఆవేదన చెందారు.
Similar News
News October 26, 2025
సెలక్టర్లపై కైఫ్ సంచలన ఆరోపణలు

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావాలని కొందరు సెలక్టర్లు ఎదురుచూస్తున్నారని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేశారు. 2027 ODI వరల్డ్కప్ రేసు నుంచి వారిని తప్పించాలని భావిస్తున్నారని చెప్పారు. తమను జట్టు నుంచి తొలగించే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదని తన యూట్యూబ్ ఛానల్లో అన్నారు. WC జరిగే సౌతాఫ్రికా పిచ్లపై అనుభవమున్న వారిద్దరూ కచ్చితంగా ఆడాలని అభిప్రాయపడ్డారు.
News October 26, 2025
చిన్నవయసులోనే వృద్ధాప్యమా?

వయసుతోపాటు వృద్ధాప్యం రావడం సహజమే కానీ చిన్నవయసులోనే ఈ లక్షణాలు కనిపించడం చాలామందిని ఇబ్బంది పెడుతోంది. దీనికి జెనెటిక్స్తో పాటు ఒత్తిడి, నిద్ర, ఆహారం, లైఫ్స్టైల్, అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం కారణాలంటున్నారు నిపుణులు. పోషకాహారం తీసుకోవడం, తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు మీకు నప్పే ఫేస్వాష్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, విటమిన్ C, నియాసినమైడ్ సీరమ్ వాడాలని సూచిస్తున్నారు.
News October 26, 2025
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు: CBN

AP: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి, ప్రత్యేక అధికారులను నియమించాం. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రభావిత ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించాను’ అని ట్వీట్ చేశారు.


