News April 24, 2024

శశిథరూర్ ఒక ఆశను కల్పించారు: ప్రకాశ్ రాజ్

image

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తిరువనంతపురం నుంచి మళ్లీ గెలుస్తారని నటుడు ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పారు. ‘థరూర్ ఈ నియోజకవర్గానికి చాలా చేశారు. మళ్లీ ఆయనే గెలుస్తారు. ఆయన నాకు మిత్రుడని నేను మద్దతు ఇవ్వడం లేదు. గడచిన దశాబ్ద కాలంగా ఈ దేశ ప్రతినిధిగా థరూర్ నమ్మకాన్ని ఇచ్చారు’ అని పేర్కొన్నారు. తిరువనంతపురంలో థరూర్ 2009 నుంచి గెలుస్తుండటం గమనార్హం.

Similar News

News March 3, 2026

9 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన BJP

image

9 మంది రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పార్టీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేశ్ కుమార్ బిహార్ నుంచి ఎంపిక కానున్నారు. అస్సాం నుంచి తెరాశ్ గోవల్ల, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, హరియాణా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సమాల్, సుజీత్ కుమార్, బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను సెలక్ట్ చేసింది. ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.

News March 3, 2026

యుద్ధ ప్రభావం.. ఇరాన్‌లో 787 మంది మృతి

image

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల వల్ల ఇప్పటి వరకు 787 మంది మరణించినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్‌లోని కీలక సైనిక కేంద్రాలు, వ్యూహాత్మక స్థావరాలపై దాడులు కొనసాగుతుండటంతో ప్రాణనష్టం పెరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 1,000 మంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మరణించారు.

News March 3, 2026

270పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ట్రైనీ) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.47,330తో పాటు అలవెన్సులు చెల్లిస్తారు. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nclcil.in