News June 4, 2024

శశిథరూర్‌ వెనుకంజ

image

కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ తిరువనంతపురంలో విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఆయనపై కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ 4,948 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తిరువనంతపురంలో శశిథరూర్ మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన 99,989 ఓట్లతో ఘన విజయం సాధించారు.

Similar News

News September 9, 2025

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: హైకోర్టు

image

TG: గ్రూప్-1పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది. పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని, దాని ఆధారంగానే ఫలితాలు వెలువరించాలని TGPSCని ఆదేశించింది. అది సాధ్యం కాకపోతే పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలిపింది. అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారందరికీ అవకాశం కల్పించాలని సూచించింది. 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.

News September 9, 2025

ఎంపీలతో సీఎం రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్

image

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. సరైన విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు.

News September 9, 2025

పిల్లలకు ఐఐటీ ఫౌండేషన్ క్లాసులు.. సైకాలజిస్టు ఏమన్నారంటే?

image

పిల్లలను IIT ఫౌండేషన్ కోర్సుల్లో చేర్పిస్తూ కొందరు ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని సైకాలజిస్ట్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పిల్లల మెదడు/మనసు కొన్ని విషయాలని ఓ వయసు వచ్చేవరకూ అర్థం చేసుకోలేవు. దీన్ని సైకాలజిస్టు జీన్ పియాజే చాలా ఏళ్ల క్రితం అధ్యయన పూర్వకంగా నిరూపించారు. దానికి తగ్గట్లే బడిలో మన పాఠ్యాంశాలుంటాయి. ఇప్పుడు నువ్వు ఐదో తరగతిలో ఐఐటీ అంటే వెధవ ఎవడిక్కడ?’ అని విమర్శించారు.