News June 18, 2024
సోనాక్షి పెళ్లికి శత్రుఘ్న సిన్హా వస్తారు: పహ్లజ్

బాలీవుడ్ ప్రేమ జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహానికి శత్రఘ్న సిన్హా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని సోనాక్షి అంకుల్ పహ్లజ్ వెల్లడించారు. ఎన్నికల కోసం సోనాక్షి తండ్రి శత్రుఘ్న 3 నెలల పాటు ముంబై విడిచి వెళ్లారని చెప్పారు. తిరిగి వచ్చాక ఆయనకు అంతా వివరించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు సోనాక్షి పెళ్లి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని <<13418948>>శత్రుఘ్న<<>> వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 1, 2025
కాంగ్రెస్కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్కు ఆ పార్టీ MP శశిథరూర్కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.
News December 1, 2025
సంస్కరణల ప్రభావం.. నవంబర్లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.
News December 1, 2025
2026లోనే తేలనున్న కృష్ణా జలాల వివాదం!

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్-II తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదని కేంద్రమంత్రి రాజ్ భూషణ్ వెల్లడించారు. నిర్ణయాన్ని వెల్లడించేందుకు గడువు పొడిగించాలని ట్రిబ్యునల్ కోరిందన్నారు. దీంతో 2025 AUG 1 నుంచి జులై 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో నీటి పంపకాల పంచాయితీకి వచ్చే ఏడాదే ముగింపు దొరకనుంది.


