News April 4, 2024

వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉంది: CBN

image

AP: విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. కొవ్వూరు ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందని ఆరోపించారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓట్లు వేయొద్దని స్వయంగా జగన్ చెల్లే కోరుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షాలతో కూటమిగా వచ్చామని చంద్రబాబు తెలిపారు.

Similar News

News November 10, 2025

ధర్మేంద్ర హెల్త్‌పై రూమర్స్.. టీమ్ క్లారిటీ

image

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ <<18162519>>ధర్మేంద్ర<<>> ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిని నటుడి టీమ్ ఖండించింది. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఆస్పత్రికి రొటీన్ చెకప్‌కు వెళ్లగా ఇలాంటి వార్తలు వచ్చాయి’ అని క్లారిటీ ఇచ్చారు.

News November 10, 2025

న్యూస్ రౌండప్

image

*రేపు HYD ఘట్కేసర్ NFC నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
*దేవాలయాల్లో తొక్కిసలాట నివారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
*శంషాబాద్ విమానాశ్రయంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. 2.70 లక్షల ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
*లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

News November 10, 2025

జూబ్లీహిల్స్.. వెరీ లేజీ!

image

జూబ్లీహిల్స్.. పేరుకే లగ్జరీ కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెరీ లేజీ. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా సగం మందే ఓట్లు వేస్తున్నారు. 2023లో 47.58%, 2018లో 47.2% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ రోజు ప్రభుత్వం హాలిడే ప్రకటిస్తున్నా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ ఉపఎన్నిక కీలకంగా మారడంతో ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.