News March 27, 2024
ప్రియుడి❤️ కోసం రూ.25వేల కోట్లు వదిలేసింది
ఓ యువతి తన ప్రియుడి కోసం రూ.వేల కోట్ల సంపదను తృణప్రాయంగా వదిలేశారు. మలేషియాకు చెందిన బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె ఏంజెలిన్ ఫ్రాన్సిస్ ఆక్స్ఫర్డ్ వర్సిటీలో చదివారు. ఆ సమయంలో జెడిడియాను ప్రేమించారు. కానీ వారి పెళ్లికి ఏంజెలిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రూ.వేల కోట్ల ఆస్తి కావాలో.. బాయ్ఫ్రెండ్ కావాలో తేల్చుకోమన్నారు. కానీ తన వాటా రూ.25 వేల కోట్లను ఆమె వదిలేసుకుని ప్రియుడిని పెళ్లాడారు.
Similar News
News October 4, 2024
మరింత పెరిగిన జుకర్బర్గ్ సంపాదన
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరింత సంపన్నులయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్($205 బిలియన్లు)ను అధిగమించి ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. జుకర్బర్గ్ నికర విలువ $206.2 బిలియన్లకు పెరిగింది. కాగా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ $256.2 బిలియన్లతో ప్రపంచ కుబేరుడి స్థానాన్ని నిలుపుకున్నారు. ఫ్రెంచ్ బిజినెస్మెన్ బెర్నార్డ్ అర్నాల్ట్ $193 బిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
News October 4, 2024
నందిగం సురేశ్కు బెయిల్
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
News October 4, 2024
తిరుమల లడ్డూ వ్యవహారం.. సుప్రీం కీలక ఆదేశాలు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఐదుగురు సభ్యులతో SIT ఏర్పాటు చేసి అందులో CBI నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒక నిపుణుడిని ఉంచాలని సూచించింది. CBI డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది. ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.