News December 2, 2024
శిండేకు అనారోగ్యం.. ఢిల్లీకి అజిత్ పవార్

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా మహాయుతిలో పదవుల పంపకం కొలిక్కిరావడం లేదు. కీలక శాఖల కోసం శివసేన, NCP పట్టుబడుతున్నాయి. శాఖల కేటాయింపు తేలకపోవడంతోనే CM అభ్యర్థి ప్రకటనను బీజేపీ వాయిదా వేస్తోంది. దీనిపై సోమవారం జరగాల్సిన మహాయుతి నేతల సమావేశం శిండే అనారోగ్యం వల్ల వాయిదా పడినట్టు తెలిసింది. మరోవైపు కోరిన శాఖల్ని దక్కించుకొనేందుకు అజిత్ పవార్ మళ్లీ ఢిల్లీకి పయనమయ్యారు.
Similar News
News January 10, 2026
SHOCKING: ఆన్లైన్లో ‘రాజాసాబ్’ HD ప్రింట్

డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టికెట్ హైక్స్ విషయంలో ప్రభుత్వ మెమోను TG హైకోర్టు కొట్టివేయగా తాజాగా ఈ చిత్ర HD ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. కేటుగాళ్లు ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్లైన్ సైట్లో అప్లోడ్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ X వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా పైరసీ చేయడం నేరమంటూ మండిపడుతున్నారు.
News January 10, 2026
పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ ఎలా?

పత్తి ఏరిన తర్వాత కట్టెలను ట్రాక్టర్తో నడిచే ష్రెడ్డర్ యంత్రంతో ముక్కలుగా చేయవచ్చు. తర్వాత రెక్క నాగలితో లోతు దుక్కి చేయాలి. ఈ వ్యర్థాలను తొందరగా కుళ్లించే సూక్ష్మజీవుల కల్చర్ను, ట్రైకోడెర్మ జీవ శిలీంధ్రనాశినిని పశువుల ఎరువుతో కలిపి నేలపై చల్లి రోటవేటర్తో దున్ని చదును చేయాలి. పత్తి కట్టె వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ లేదా వర్మికంపోస్టు విధానంలో సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చు.
News January 10, 2026
సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు

సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి ఈ నెల 19 వరకు మరిన్ని స్పెషల్ ట్రైన్లను నడపనుంది. ఈ నెల 11, 12 తేదీల్లో HYD-సిర్పూర్ కాగజ్ నగర్(07473), ఈ నెల 10, 11 తేదీల్లో సిర్పూర్-HYD (07474), 11, 12, 12, 18, 19 తేదీల్లో HYD-విజయవాడ(07475), 10, 11, 12, 17, 19 తేదీల్లో విజయవాడ-HYD(07476) మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.


