News November 23, 2024
1.20 లక్షల ఓట్ల మెజార్టీతో శిండే గెలుపు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ శిండే ఏకంగా 1,20,717 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కోప్రి-పచ్పఖాడి స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు 1,59,060 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కేదార్ ప్రకాశ్(శివసేన-UBT) కేవలం 38,343 ఓట్లు సాధించారు. 2009 నుంచి షిండే వరుసగా గెలవడమే కాకుండా మెజార్టీని పెంచుకుంటూ వస్తున్నారు. 2009లో 32,776, 2014లో 51,869, 2019లో 89,300 ఓట్ల మెజార్టీని సాధించారు.
Similar News
News November 21, 2025
ఫిష్ ఫార్మింగ్కు సహకారం అందిస్తాం: కలెక్టర్

ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మింగ్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఫిష్ ఫార్మింగ్ రైతులకు హామీ ఇచ్చారు. ఐ.పోలవరం మండలంలోని పెదమడి వద్ద ఆర్నమెంటల్ చేపల పెంపకం కేంద్రాన్ని ఆయన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుతో కలిసి పరిశీలించారు. ఎక్వేరియంలో రంగురంగుల ఆర్నమెంటల్ చేపల పెంపకం ద్వారా 22 రకాల జాతుల చేపలను పెంచుతున్నట్లు రైతు వర్మ వారికి వివరించారు.
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.


