News November 23, 2024
1.20 లక్షల ఓట్ల మెజార్టీతో శిండే గెలుపు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ శిండే ఏకంగా 1,20,717 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కోప్రి-పచ్పఖాడి స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు 1,59,060 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కేదార్ ప్రకాశ్(శివసేన-UBT) కేవలం 38,343 ఓట్లు సాధించారు. 2009 నుంచి షిండే వరుసగా గెలవడమే కాకుండా మెజార్టీని పెంచుకుంటూ వస్తున్నారు. 2009లో 32,776, 2014లో 51,869, 2019లో 89,300 ఓట్ల మెజార్టీని సాధించారు.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


