News February 25, 2025
శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు

శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేడుకకు ముస్తాబైంది. 1500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సన్నాహాలను మంత్రి ఆనం పరిశీలించారు. ఆలయ నిర్వాహకులు ఉచిత లడ్డూ పంపిణీ చేస్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
Similar News
News October 21, 2025
H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. USలో చదువుతున్న వారికి హెచ్-1బీ వీసా ఫీజు నుంచి సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ మినహాయింపు కల్పించింది. అమెరికా బయటి నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది.
News October 21, 2025
నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, UAEలలో 3 రోజులు పర్యటిస్తారు. వచ్చేనెల విశాఖలో జరిగే CII సదస్సుకు రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాలకు చెందిన వ్యాపారవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. CM వెంట మంత్రులు TG భరత్, జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు.
News October 21, 2025
కళ్యాణ యోగం కల్పించే ‘కాళీ రూపం’

కంచి కామాక్షి ఆలయం వెనుక కాళీ కొట్టమ్లో ఆది కామాక్షి దేవి కొలువై ఉంటారు. పార్వతీ దేవియే ఇక్కడ కాళీమాత రూపంలో వెలిశారని చెబుతారు. ఈ ఆలయంలో అమ్మవారి రూపం శివలింగంపై కొలువై ఉంటుంది. అర్ధనారీశ్వర లింగంగా పూజలందుకుంటుంది. ఆదిశంకరాచార్యులు ఈ గుడిలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి, అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపజేశారని చెబుతారు. పెళ్లికాని వారు కామాక్షి దేవిని దర్శిస్తే కళ్యాణ యోగం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.