News February 25, 2025
శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు

శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేడుకకు ముస్తాబైంది. 1500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సన్నాహాలను మంత్రి ఆనం పరిశీలించారు. ఆలయ నిర్వాహకులు ఉచిత లడ్డూ పంపిణీ చేస్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


