News June 4, 2024
1.50 లక్షల ఓట్ల మెజార్టీలో శివరాజ్ సింగ్

ఎంపీగా పోటీ చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విదిశాలో తన సమీప ప్రత్యర్థి ప్రతాప్ భాను శర్మ(కాంగ్రెస్)పై ఆయన 1,50,870 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శివరాజ్కు కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
Similar News
News December 11, 2025
అనవసరంగా హారన్ కొడుతున్నారా?

శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం, అనవసరంగా లేదా నిషేధిత ప్రాంతాలలో హారన్ మోగిస్తే జరిమానాలు విధిస్తారనే విషయం మీకు తెలుసా? మొదటిసారి ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ. 1,000, ఆ తర్వాత పట్టుబడితే రూ. 2,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు ఈ నిబంధనలు తెలుసుకొని అనవసరంగా హారన్ కొట్టొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News December 11, 2025
రూ.100కే T20 వరల్డ్ కప్ టికెట్స్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం 6.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ICC ప్రకటించింది. ఇండియాలో ఫేజ్ వన్ టికెట్స్ రేట్స్ రూ.100 నుంచి, శ్రీలంకలో రూ.295 నుంచి ప్రారంభంకానున్నాయి. FEB 7నుంచి MAR 8 వరకు టోర్నీ కొనసాగనుంది. టికెట్స్ బుక్ చేసుకునేందుకు <
News December 11, 2025
APPLY NOW: CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(<


