News June 4, 2024
8 లక్షల ఓట్ల మెజారిటీతో శివరాజ్ సింగ్ గెలుపు

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, విదిశ BJP అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ 8 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అల్లుడు, INC అభ్యర్థి రాధాకృష్ణ 27,205 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శివమొగ్గలో యడియూరప్ప తనయుడు, BJP అభ్యర్థి బీవై రాఘవేంద్ర, హవేరి నుంచి బసవరాజు బొమ్మై గెలుపొందారు. అటు బిహార్లో మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ లక్షకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు.
Similar News
News December 11, 2025
భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ షురూ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మొదలైంది. 4 మండలాల్లోని 82 గ్రామాలు, 712 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
News December 11, 2025
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

AP: గిద్దలూరు మాజీ MLA పిడతల రామభూపాల్ రెడ్డి(89) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి 1994లో టీడీపీ నుంచి MLAగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
News December 11, 2025
భారత్కి సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నా: మస్క్

స్టార్లింక్ ద్వారా భారత్కు సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నానని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్తో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశమైన తరువాత మస్క్ ఈ విధంగా స్పందించారు. భారత్లో చివరి మైలు కనెక్టివిటీని శాటిలైట్ ద్వారా విస్తరించే దిశగా చర్చలు జరిగాయని సింధియా ‘X’లో పోస్ట్ చేశారు. డిజిటల్ భారత్ లక్ష్యాలకు శాటిలైట్ టెక్నాలజీ కీలకమని అన్నారు.


