News June 4, 2024
8 లక్షల ఓట్ల మెజారిటీతో శివరాజ్ సింగ్ గెలుపు

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, విదిశ BJP అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ 8 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అల్లుడు, INC అభ్యర్థి రాధాకృష్ణ 27,205 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శివమొగ్గలో యడియూరప్ప తనయుడు, BJP అభ్యర్థి బీవై రాఘవేంద్ర, హవేరి నుంచి బసవరాజు బొమ్మై గెలుపొందారు. అటు బిహార్లో మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ లక్షకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు.
Similar News
News December 24, 2025
సీఎంలు చంద్రబాబు, రేవంత్ క్రిస్మస్ విషెస్

ప్రజలకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరమని CBN అన్నారు. ఏసు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్ తెలిపారు. అటు BRS చీఫ్ కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
News December 24, 2025
బాధితులను క్రిమినల్స్గా చూడటం న్యాయమా: రాహుల్ గాంధీ

రేపిస్టులకు బెయిల్ ఇవ్వడం, బాధితులను క్రిమినల్స్గా చూడటం ఏ విధమైన న్యాయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్న ‘‘ఉన్నావ్’’ అత్యాచార బాధితురాలితో అధికారులు వ్యవహరించిన తీరు కరెక్టేనా? న్యాయం కోరడమే ఆమె చేసిన తప్పా? బాధితురాలిని పదేపదే వేధించారు. ఇప్పటికీ ఆమె భయపడుతూనే బతుకుతున్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం సిగ్గుచేటు’ అని ఫైర్ అయ్యారు.
News December 24, 2025
20 లక్షల ఉద్యోగాల కల్పనకే ప్రాధాన్యం: CM

AP: మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రభుత్వ శాఖలు ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర-2047, 10 సూత్రాల అమలుపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ’20లక్షల ఉద్యోగాల కల్పనే మొదటి ప్రాధాన్యంగా పని చేయాలి. 10 సూత్రాల అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. కీలక మిషన్గా నీటి భద్రత అంశంపై దృష్టి పెట్టాలి. కరవు అన్న మాట లేకుండా వరద నీటి నిర్వహణ జరగాలి’ అని సూచించారు.


