News June 4, 2024
8 లక్షల ఓట్ల మెజారిటీతో శివరాజ్ సింగ్ గెలుపు

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, విదిశ BJP అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ 8 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అల్లుడు, INC అభ్యర్థి రాధాకృష్ణ 27,205 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శివమొగ్గలో యడియూరప్ప తనయుడు, BJP అభ్యర్థి బీవై రాఘవేంద్ర, హవేరి నుంచి బసవరాజు బొమ్మై గెలుపొందారు. అటు బిహార్లో మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ లక్షకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు.
Similar News
News December 19, 2025
e-KYC లేకపోయినా బియ్యం పంపిణీ: పౌరసరఫరాల శాఖ

TG: రేషన్కార్డుదారులు ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. e-KYC తప్పనిసరి అని, అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు. బియ్యం పంపిణీని ఆపబోమని స్పష్టం చేశారు. కార్డులో పేరు ఉన్నవారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు, ఐరిష్ ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు.
News December 18, 2025
మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీని ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’తో ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సత్కరించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA)పై చర్చలు జరిపారు. ప్రస్తుతం భారత్-ఒమన్ మధ్య 12 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతోంది.
News December 18, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) దర్యాప్తు చేయనుంది. సభ్యులుగా 9 మంది అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు <<18541312>>లొంగిపోయిన<<>> సంగతి తెలిసిందే.


