News March 26, 2025
SHOCK: మరికొన్ని రోజుల్లో ఆర్థికమాంద్యం!

2025 ద్వితీయార్థంలో ఆర్థికమాంద్యం వస్తుందని USలో మెజారిటీ కార్పొరేట్ ఫైనాన్స్ చీఫ్స్ అంచనా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్, రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, కన్జూమర్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడమే ఇందుకు కారణమని CNBC CFO కౌన్సిల్ సర్వేలో అభిప్రాయపడ్డారు. మాంద్యం వస్తుందని 3 నెలల క్రితం 7% మంది అంచనా వేయగా ఇప్పుడీ సంఖ్య 60%కి చేరుకుంది. 2026లో ఆర్థిక వ్యవస్థ సంకోచం మొదలవుతుందని మరో 15% అంచనా వేశారు.
Similar News
News March 29, 2025
ఈ రాశుల వారికి రేపటి నుంచి పండగే!

చాలా మంది రాశి ఫలాలను నమ్ముతుంటారు. ఉగాది వచ్చిందంటే చాలు ఆ ఏడాది తమ రాశి ఫలం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. రేపటి నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో కొత్త పంచాంగం అందుబాటులోకి రానుంది. అయితే ఈ నూతన ఏడాది మిథునం, కర్కాటకం, తుల, కన్య రాశుల వారి ఫలితాలు అద్భుతంగా ఉండనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. వీరికి కొత్త ఏడాది శుభ ఫలితాలే. ఇంతకీ మీది ఏ రాశి? COMMENT
News March 29, 2025
వృద్ధ దంపతుల ప్రాణాలు తీసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ మోసగాళ్ల దోపిడీతో కర్ణాటకకు చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు వీరికి వీడియో కాల్ చేసి తాము ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులమని.. మీపై కేసులయ్యాయని బెదిరించారు. దీంతో భయపడిన దంపతులు తొలుత రూ.5లక్షలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తరచుగా బెదిరిస్తూ రూ.50 లక్షలు దోపిడీ చేశారు. దీంతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి సూసైడ్ లెటర్లో ఆత్మహత్య కారణాలు రాశారు.
News March 29, 2025
రేపు ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ?

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘UI’ మూవీ రేపు సా.4.30 గంటలకు జీకన్నడ ఛానల్లో ప్రసారం కానుంది. ఆ వెంటనే జీ5 OTTలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ చిత్రాలు కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే జీ5లోకి వచ్చేశాయి. ఇదే ట్రెండ్ను యూఐ సినిమాకు కూడా ఓటీటీ సంస్థ కొనసాగించనుందని సమాచారం.