News March 25, 2024
ఎయిర్టెల్, జియో యూజర్లకు షాక్?

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎయిర్టెల్, జియో తమ ఆదాయం పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నాయి. ధరలు పెంచి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ప్యాకేజీ ధరలు పెంచకుండా డేటా వినియోగం మరింత పెంచి తద్వారా అధిక ధరలు గల ప్యాకేజీల వైపు కస్టమర్లను మళ్లించేలా జియో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ 15శాతం వరకు టారిఫ్లను పెంచే ఛాన్సుంది.
Similar News
News January 6, 2026
రష్యా లేకుంటే గయానా.. భారత్ తగ్గేదే లే!

రష్యా నుంచి భారత్ ఆయిల్ <<18775987>>దిగుమతులు<<>> తగ్గించుకున్నా పెద్దగా ఇబ్బంది లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ అమెరికా దేశమైన గయానా నుంచి గతేడాది NOVలో 4 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ ఉన్న భారీ ఓడలు ఇండియాకు బయల్దేరాయి. ఈ నెలలో ఆ ఆయిల్ మన దేశానికి చేరుకోనుంది. అటు తమ దేశంలోని చమురు బావులను తవ్వుకోవచ్చని గయానా మన దేశానికి ఆఫర్ ఇచ్చింది. దీర్ఘకాలంలో ఇవి ఇండియాకు ఎంతో మేలు చేయనున్నాయి.
News January 6, 2026
Op Sindoor దెబ్బ.. US చుట్టూ తిరిగిన పాక్!

ఇండియా చేపట్టిన <<16441544>>ఆపరేషన్ సిందూర్<<>>కు భయపడి పాకిస్థాన్ అమెరికా సాయం కోరిన విషయం తాజాగా వెల్లడైంది. దాడులు ఆపేలా USతో లాబీయింగ్ చేసేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నించింది. US అధికారులు, చట్టసభ్యులు, మీడియా సంస్థలతో పాక్ రాయబారులు, రక్షణ అధికారులు 50పైగా మీటింగ్స్ నిర్వహించినట్లు తెలిసిందని NDTV వెల్లడించింది. ఆ తర్వాతే పలు ఒప్పందాలు, ట్రంప్-మునీర్ భేటీ వంటివి జరిగాయని తెలిపింది.
News January 6, 2026
శ్రీవారి ఆస్తులపై పక్కా లెక్కలుండాలి: TTD EO

AP: తిరుమల వేంకన్న భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై నిపుణుల సహకారంతో కచ్చితమైన లెక్కలను రూపొందించాలని TTD EO సింఘాల్ అధికారులను ఆదేశించారు. ‘టీటీడీ కళ్యాణ మండపాల స్థితిగతులపైనా సమీక్షించి సౌకర్యాలు మెరుగుపర్చాలి. సంస్థ ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేయాలి. ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమల్లోకి తేవాలి’ అని ఈవో సూచించారు.


