News March 19, 2024
బీజేపీకి షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710830061053-normal-WIFI.webp)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి షాక్ ఇచ్చారు కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి ప్రెసిడెంట్ పశుపతి కుమార్ పరాస్. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. NDA కోసం నిజాయతీగా పనిచేసినా తమ పార్టీకి అన్యాయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ NDA నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. కాగా బిహార్ తరఫున NDA నిన్న ప్రకటించిన లోక్సభ సీట్లలో RLJPకి ఒక్క సీటూ కేటాయించలేదు.
Similar News
News July 8, 2024
సెలబ్రెటీల వెడ్డింగ్కు జోసెఫ్ రాధిక్ ఉండాల్సిందే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720428077948-normal-WIFI.webp)
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకను ఇంటర్నేషనల్ అవార్డీ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధిస్తున్నారు. ఈయన రోజుకు రూ.1.5 లక్షలు ఛార్జ్ చేస్తారట. కత్రినా కైఫ్- విక్కీ, కోహ్లీ – అనుష్క, సిద్ధార్థ్- కియారా వివాహాలకు పనిచేశారు. కార్పొరేట్లో మూడేళ్లు పని చేశారు. ఫొటోస్ తీయడంలో సంతృప్తి ఉండటంతో 2010లో ఫొటోగ్రాఫర్గా మారారు. ఇప్పుడు సెలబ్రెటీలు సైతం కోరుకునేంత ఎత్తుకు ఎదిగారు.
News July 8, 2024
కొడాలి నానికి హైకోర్టులో ఊరట
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718940091218-normal-WIFI.webp)
AP: మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట దక్కింది. వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో నానిపై గతంలో కేసు నమోదైంది. ఈ సందర్భంగా నానిని అరెస్ట్ చేయవద్దని కోరుతూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు 41A నోటీసులు ఇవ్వాలని, విచారణలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
News July 8, 2024
బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చురకలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22024/1707722640864-normal-WIFI.webp)
సందేశ్ఖాలీ కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి చురకలంటించింది. ఆ ఘటనపై CBIతో దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం కోర్టు ‘ఒక వ్యక్తిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది?’ అని ప్రశ్నించింది.