News April 8, 2024
బోట్ యూజర్లకు షాక్!

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్కు సంబంధించి ఫోర్బ్స్ ఇండియా సంచలన రిపోర్ట్ వెల్లడించింది. ఈ సంస్థ నుంచి స్మార్ట్వాచ్, హెడ్ఫోన్స్ వంటి గ్యాడ్జెట్లు కొన్న 75లక్షల మందికిపైగా కస్టమర్ల పర్సనల్ డేటా లీకైనట్లు తెలిపింది. ShopifyGUY అనే హ్యాకర్ ఈ డేటాను డార్క్ వెబ్లో లీక్ చేసినట్లు పేర్కొంది. ఇందులో కస్టమర్ల పేర్లు, ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు, కస్టమర్ ఐడీలు మొదలైన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 3, 2025
KKR కొత్త జెర్సీ.. కొత్త సంప్రదాయానికి నాంది

IPL-2025 కోసం కోల్కతా నైట్ రైడర్స్(KKR) కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గత సీజన్తో పోలిస్తే ఇది పూర్తి డిఫరెంట్గా ఉంది. అలాగే ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీని గెలిచినందుకు గుర్తుగా జెర్సీపై 3 స్టార్లను పెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో జెర్సీ షోల్డర్లకు గోల్డ్ బ్యాడ్జ్లు ఉండనున్నాయి. లీగ్ చరిత్రలో ఈ బ్యాడ్జ్ ధరించిన తొలి టీమ్గా KKR నిలిచింది. ఇకపై ఏటా ఈ సంప్రదాయం కొనసాగనుంది.
News March 3, 2025
వివి వినాయక్ హెల్త్ రూమర్స్కు చెక్

ప్రముఖ దర్శకుడు VV వినాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. ఆయన గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించింది. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని అభిమానులను కోరింది. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా గతేడాది ఛత్రపతి మూవీని హిందీలో రీమేక్ చేసిన ఆయన ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు.
News March 3, 2025
CM రేవంత్కు హరీశ్ సవాల్

TG: బీఆర్ఎస్ హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని ఆరోపించిన సీఎం రేవంత్పై హరీశ్ రావు మండిపడ్డారు. పనులు జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని, లేదంటే ఆయన రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో అన్ని విషయాలను ఎండగడతామన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత టన్నెల్ పనులకు BRS ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, విద్యుత్తు బకాయిలు చెల్లించలేదని సీఎం విమర్శించిన విషయం తెలిసిందే.