News February 20, 2025
మందుబాబులకు షాక్.. 20% రేట్లు పెంచనున్న ప్రభుత్వం?

TG: రాష్ట్రంలో <<15423502>>బీరు ధరలను పెంచిన<<>> ప్రభుత్వం త్వరలో మద్యంపైనా 15-20 శాతం రేట్ల పెంపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధరల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యంపై రేట్లు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Similar News
News November 9, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

<
News November 9, 2025
అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.
News November 9, 2025
షట్డౌన్ ఎఫెక్ట్: 1,460 విమానాల రద్దు

అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ఎఫెక్ట్ విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. రెండో రోజు ఏకంగా 1,460 విమాన సర్వీసులను ఎయిర్ లైన్స్ రద్దు చేశాయి. మరో 6 వేలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. తొలి రోజు 1,025 విమానాలు రద్దు కాగా, 7 వేలకు పైగా డిలే అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భద్రతా సమస్యల కారణంగా 40 మేజర్ ఎయిర్ పోర్టుల్లో 4 శాతం డైలీ సర్వీసులను క్యాన్సిల్ చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది.


